Asianet News TeluguAsianet News Telugu

మెట్రో స్టేషన్ లో మౌనిక మృతి... రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్

మౌనిక కుటుంబసభ్యులకు ఎక్స్ గ్రేషియాపై అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే ఇస్తామంటూ ఎల్ అండ్ టీ అధికారులు బేరం ఆడటం విశేషం. అంతేకాకుండా ప్రమాదానికి ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనే విషయంపై కూడా అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.

mounika death.. L&T officials meeting with mounika family
Author
Hyderabad, First Published Sep 23, 2019, 2:07 PM IST

రెండు రోజుల క్రితం మెట్రో స్టేషన్ లో మౌనిక అనే యువతి చనిపోయిన సంగతి తెలిసిందే. అమీర్ పేట మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడి మీద పడి ఆమె మృతి చెందింది. కాగా... ఆమె కుటుంబసభ్యులతో సోమవారం ఎల్ అండ్ టీ అధికారులు చర్చలు జరిపారు. రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మౌనిక కుటుంబసభ్యులు అధికారులను డిమాండ్ చేశారు.

కాగా... మౌనిక కుటుంబసభ్యులకు ఎక్స్ గ్రేషియాపై అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే ఇస్తామంటూ ఎల్ అండ్ టీ అధికారులు బేరం ఆడటం విశేషం. అంతేకాకుండా ప్రమాదానికి ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనే విషయంపై కూడా అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.

ఎక్స్ గ్రేషియా కాకుండా ఇన్సూరెన్స్ పై చర్చిస్తుండటంతో మౌనిక బంధువులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మౌనిక బంధువులు డిమాండ్ చేస్తుండగా ఈ విషయంపై అధికారులు స్పందించలేదు. 

కాగా...ఆదివారం సాయంత్రం మౌనిక అనే మహిళ.. మెట్రో స్టేషన్ లో నిలబడి ఉండగా... ఆమెపై మెట్రో పెచ్చులు ఊడిపడి ఆమె తీవ్రగాయాలపాలయ్యింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... తీవ్రగాయాలయ్యి అప్పటికే చనిపోయినట్లు అధికారులు చెప్పారు. సోదరితో పాటు సారథి స్టూడియోస్‌ సమీపానికి వచ్చిన ఆమె వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో అక్కడి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ మెట్ల కిందకు వెళ్లి ఆ ఇద్దరు నిల్చొన్నారు. అదే సమయంలో పెద్ద పెట్టున మెట్రో స్టేషన్‌ పై నుంచి పెచ్చులు ఊడిపడి ఆమెపై పడటంతో దుర్మరణం చెందింది.

ఒక్క అమీర్‌పేట సారథి స్టూడి యోస్‌ వద్ద అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లోనే కాదు.. మెట్రో దారి పొడుగునా వర్షం వస్తే వాహనచోద కులు, పాదచారులు ఆయా మెట్రో స్టేషన్‌ కిందకు పరుగులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం సారథి స్టూడియోస్‌ వద్ద అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో సంభవించిన ఘోరంపై ప్రజలు ఉలికిపాటుకు గుర య్యారు. తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ ఘటనపై మెట్రో నిర్మాణంపై ప్రజలు తీవ్ర అసహ నాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కాగా, మౌనికకు రెండు నెలల క్రితమే పెళ్లయింది. మౌనిక మృతి వార్తతో ఆ కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా మెట్రో స్టేషన్‌నుంచి పెచ్చులు ఊడిపడటమేంటని ప్రజానీకం ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు.

read more news

రెండు నెలల క్రితమే పెళ్లి: మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి టెక్కీ మౌనిక దుర్మరణం

హైదరాబాద్ మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి లేడీ టెక్కీ మృతి (వీడియో)

యువతి ప్రాణం తీసిన మెట్రో స్టేషన్... స్పందించిన అధికారులు

Follow Us:
Download App:
  • android
  • ios