Asianet News TeluguAsianet News Telugu

''2024 నాటికి వినికిడి సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్''

2024నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో వినికిడి లోపంలేకుండా చేస్తామని దీన్ దయాల్ శ్రావణ్ ఫౌండేషన్ స్పష్టం చేసింది.  

deen dayal sravan foundation programme at vijayawada
Author
Vijayawada, First Published Oct 10, 2019, 5:27 PM IST

విజయవాడ:  2024 సవత్సరంలోపే వినికిడి సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దుతామని దీన్ దయల్  శ్రావణ ఫౌండేషన్ ప్రకటించింది.  విజయవాడలోని ఓ హోటల్లో ఈ ఫౌండేషన్ చైర్మన్ రేగుల రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించి తమ భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటించారు. 

దీన్ దయాల్ రిలీఫ్ ఫండ్ ద్వారా వినికిడి(చెవిటి) సమస్య వున్నవారికి ఉచిత వినికిడి మిషన్లు అందజేశారు. అలాగే మొత్తం రూ.96 వేల రూపాయలను 9 మందికి అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి నాయకులు,మాజీ ఆదాయపన్ను కమీషనర్ చింతల పార్థసారథి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంస్థ ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఐదు వెలమందికి పైగా వినికిడి సమస్య ఉన్నవారికి మిషన్లు పంపిణీ  చేశామన్నారు. 2024 నాటికీ పూర్తిగా వినికిడి సమస్య లేని రాష్ట్రంగా చేయటమే మాముందున్న ప్రధాన లక్ష్యమని రామాంజనేయులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మైనార్టీ మోర్చా కార్యదర్శి షేక్ బాజి ,మీడియా కన్వీనర్ గంగాధర్,షేక్ ఖాజా అలీ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios