ధోనిని పరుగెత్తించిన అభిమాని...ఏకంగా మైదానంలోనే (వీడియో)
టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య నాగ్ పూర్ లో రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా విసిఏ (విదర్భ క్రికెట్ అసోసియేషన్) స్టేడియంలో టీమిండియా వికెట్ కీఫర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వింత అనుభవం ఎదురయ్యింది.
టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య నాగ్ పూర్ లో రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా విసిఏ (విదర్భ క్రికెట్ అసోసియేషన్) స్టేడియంలో టీమిండియా వికెట్ కీఫర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వింత అనుభవం ఎదురయ్యింది.
టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి వస్తుండగా ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. మైదానంలోని సెక్యూరిటీని దాటుకుని ఓ అభిమాని భారత ఆటగాళ్ళ వద్దకు వచ్చాడు. అయితే అందరు ఆటగాళ్లను కాకుండా స్పెషల్ గా ధోనికి కలుసుకోడానికి ప్రయత్నిస్తూ అతడి వద్దకు పరుగెత్తాడు.
ఈ విషయాన్ని గమనించిన ధోనీ ఆ అభిమానికి దొరక్కుండా సరదాగా మైదానంలో పరుగెత్తాడు. అయితే అభిమాని కూడా తగ్గకుండా ధోని వెంటే పరుగెత్తాడు. దీన్ని చూస్తున్న అభిమానులకు మైదానంలోని అభిమానులకు కాస్సేపే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎట్టకేలకు స్టంప్స్ వద్ద ఆగిన ధోని అభిమానిని ఆలింగనం చేసుకున్నాడు.
ఈ సరదా సంఘటన నెటిజన్లకు, అభిమానులకు తెగ నచ్చడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోపై వారు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను కింద చూడండి.
వీడియో
Seen a lot out here..but still I don’t wanna miss this on my timeline...this is 🥰#Dhoni ❤️#INDvAUS pic.twitter.com/s1Zz6gZ4gg
— prudhvirajk (@rajvinay77) March 5, 2019