Asianet News TeluguAsianet News Telugu

ధోనిని పరుగెత్తించిన అభిమాని...ఏకంగా మైదానంలోనే (వీడియో)

టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య నాగ్ పూర్ లో రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్  సందర్భంగా విసిఏ (విదర్భ క్రికెట్ అసోసియేషన్) స్టేడియంలో టీమిండియా వికెట్ కీఫర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వింత అనుభవం ఎదురయ్యింది. 

dhoni funny video in nagpur odi
Author
Nagpur, First Published Mar 5, 2019, 11:09 PM IST

టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య నాగ్ పూర్ లో రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్  సందర్భంగా విసిఏ (విదర్భ క్రికెట్ అసోసియేషన్) స్టేడియంలో టీమిండియా వికెట్ కీఫర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వింత అనుభవం ఎదురయ్యింది. 

టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి వస్తుండగా ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. మైదానంలోని సెక్యూరిటీని దాటుకుని ఓ అభిమాని భారత ఆటగాళ్ళ వద్దకు వచ్చాడు. అయితే అందరు ఆటగాళ్లను కాకుండా స్పెషల్  గా ధోనికి కలుసుకోడానికి ప్రయత్నిస్తూ అతడి వద్దకు పరుగెత్తాడు. 

ఈ విషయాన్ని గమనించిన ధోనీ ఆ అభిమానికి దొరక్కుండా సరదాగా మైదానంలో పరుగెత్తాడు. అయితే అభిమాని కూడా తగ్గకుండా ధోని వెంటే పరుగెత్తాడు. దీన్ని చూస్తున్న అభిమానులకు మైదానంలోని అభిమానులకు కాస్సేపే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎట్టకేలకు స్టంప్స్ వద్ద ఆగిన ధోని అభిమానిని ఆలింగనం చేసుకున్నాడు. 

ఈ సరదా సంఘటన నెటిజన్లకు, అభిమానులకు తెగ నచ్చడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోపై వారు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను కింద చూడండి. 

వీడియో

 

 

Follow Us:
Download App:
  • android
  • ios