Asianet News TeluguAsianet News Telugu

కెమెరా మా వైపు ఉందని తెలీదు, వామిక ఫోటోలు చూపించొద్దని చెప్పినా వినరా... అనుష్క శర్మ రియాక్షన్...

మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తర్వాత స్టాండ్స్‌లో కనిపించిన వామిక కోహ్లీ... లైవ్‌లో ప్రత్యక్ష ప్రసారం... మా నిర్ణయాన్ని గౌరవించడంటూ విరుష్క జోడీ వినతి...

We were caught off guard, We stand on same decision, Virat Kohli, Anushka sharma re-acts on Vamika
Author
India, First Published Jan 24, 2022, 12:34 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల గారాల కూతురు వామిక కోహ్లీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగత ప్రైవసీకి విలువనిస్తూ వామిక కోహ్లీని సోషల్ మీడియాకి, మీడియా అటెన్షన్‌కి దూరంగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు విరాట్, అనుష్క... 

ఈ ఇద్దరి నిర్ణయం కారణంగానే జనవరిలో జన్మించిన వామిక కోహ్లీ ఫోటోలు, చాలాకాలం పాటు మీడియాలో ఎక్కడా కనిపించలేదు. కూతురితో దిగిన ఫోటోలను విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేసినా... వాటిల్లో వామిక కోహ్లీ ముఖం కనిపించకుండా చాలా జాగ్రత్త పడేవాళ్లు... అయితే  సౌతాఫ్రికాకి బయలుదేరి వెళ్లిన తర్వాత టీమ్ బస్సులో నుంచి దిగుతున్న సమయంలోనే మీడియా కెమెరాల కంటికి చిక్కింది విరాట్ కోహ్లీ కూతురు వామిక కోహ్లీ...

అయితే విరాట్ కోహ్లీ స్వయంగా ‘బేటీ ఫోటోలు తీయవద్దని’ అక్కడి కెమెరామెన్లను, ఫోటోగ్రాఫర్లను కోరడంతో చాలా పత్రికలు, వామిక కోహ్లీ ఫోటోలు దొరికినా... విరుష్క నిర్ణయానికి గౌరవం ఇచ్చి, వాటిని ప్రచురించలేదు. అయితే కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం, స్టాండ్స్‌లో వామిక కోహ్లీతో అనుష్క శర్మ నవ్వుతూ అభివాదం చేయడం కెమెరాల్లో రికార్డైంది...

మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.  మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అర్ధ శతకం పూర్తయిన తర్వాత బ్యాటును బేబీలా ఎత్తుకుని ఊపుతూ, స్ట్రాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ, కూతురు వామిక కోహ్లీలకు తన హాఫ్ సెంచరీని అంకితం చేశాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ చేసిన ఈ బేబీ సెలబ్రేషన్స్ కారణంగా కెమెరాలు, స్ట్రాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మతో పాటు వామిక కోహ్లీ ముఖం కూడా లైవ్‌లో ప్రపంచమంతటా కనిపించినట్టైంది... ఈ సంఘటనపై తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ...

‘నిన్న స్టేడియంలో మా కూతురి ఫోటోలు బయటికి వచ్చాయని తెలిసింది, ఆ తర్వాత అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కూడా. మేం కావాలని మీడియా ముందుకి రాలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. కెమెరా మా వైపు ఉందని కాదని, మేం టీవీల్లో కనిపిస్తున్నామని కానీ మాకు తెలీదు... 

ఇకపై కూడా మీరు మా నిర్ణయానికి, ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నాం. దయచేసి వామిక కోహ్లీ ఫోటోలు దింపకూడదని, వాటిని ఎక్కడా ప్రచురించకూడదని కోరుతున్నాం... కారణం మీకు ముందే చెప్పాం, అందరికీ ముందుగానే వివరించాం... థ్యాంక్యూ...’ అంటూ రాసుకొచ్చారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ...

మొదటి వన్డేలో 51 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, మూడో వన్డేలో 84 బంతుల్లో 4 ఫోర్లతో 65 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. గత 11 వన్డేల్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం ఇది 9వ సారి కావడం విశేషం. మూడో వన్డేలో 288 పరుగుల లక్ష్యఛేదనలో 283 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా, 4 పరుగుల తేడాతో ఓడి వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది...

Follow Us:
Download App:
  • android
  • ios