Asianet News TeluguAsianet News Telugu

కొడుకు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ !

Virat Kohli son Akaay: భార‌త స్టార్ క‌పుల్ విరాట్ కోహ్లీ - అనుష్క దంప‌తులు మ‌రో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. జూనియర్ విరాట్ కోహ్లీ అకాయ్ జన్మించిన తర్వాత లండన్ లో విరాట్ కోహ్లీ దిగిన ఫోటో వైరల్ గా మారింది.
 

Virat Kohli's photo goes viral on social media after son Akaay birth RMA
Author
First Published Feb 21, 2024, 12:59 PM IST

meaning of Virat Kohli's sonAkaay: విరాట్ కోహ్లీ, నటి అనుష్క దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న విరాట్-అనుష్క దంప‌తులు మ‌గ‌బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికారు. ఈ జంట సోషల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని పంచుకున్నారు. పుట్టిన బిడ్డకు అకాయ్ అని పేరు కూడా పెట్టారు. ఈ స్టార్ క‌పుల్ ఈ విష‌యం చెప్పిన వెంట‌నే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే క్ర‌మంలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ అయిన విరాట్ కోమ్లీకి సంబంధించిన ఒక ఫోటో వైర‌ల్ గా మారింది.

విరాట్-అనుష్క తమ కొడుకు పుట్టిన వార్తను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీని తరువాత, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫోటో వైరల్‌గా మారింది. అనుష్క శర్మ తన రెండవ బిడ్డకు లండన్ ఆసుపత్రిలో జన్మనివ్వబోతోందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ విరాట్ ఫోటో కూడా లండన్ కి చెందినదే అని అంటున్నారు. ఈ చిత్రంలో, విరాట్ సాయంత్రం లండన్ వీధుల్లో తిరుగుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. విరాట్ కోహ్లీ అభిమాని ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?

 

 

జూనియ‌ర్ విరాట్ కోహ్లీకి 'అకాయ్' అని పేరు.. ! 

ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ దంప‌తుల‌కు వామిక అనే కూతురు ఉంది. ఇప్పుడు రెండో బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికారు. మ‌గ‌బిడ్డ‌కు అకాయ్ అని పేరు పెట్టిన‌ట్టు విరుష్క దంప‌తులు ప్ర‌క‌టించారు. తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఫిబ్రవరి 15న తాము మ‌రో బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికామ‌నీ, అవామిక సోద‌రుడు వ‌చ్చాడ‌ని చెప్ప‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. త‌మ జీవితంలోని ఈ అందమైన క్షణాలలో అంద‌రి ఆశీస్సులు, శుభాకాంక్షలు కూడా కోరుకుంటున్నామ‌ని తెలిపారు.

ఇంగ్లండ్ సిరీస్ కు దూరంగా విరాట్ కోహ్లీ.. ! 

ప్ర‌స్తుతం భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మూడు టెస్టులు జర‌గ్గా, తొలి టెస్టులో ఓడిన భార‌త్.. ఆ త‌ర్వాత రెండు మ్యాచ్ ల‌లో ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల‌కు త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఆ త‌ర్వాత మొత్తం సిరీస్ కు దూర‌మైన‌ట్టు పేర్కొంది. దీనికి వ్య‌క్తిగ‌త కార‌ణాల‌ని పేర్కొంది. అయితే రెండో బిడ్డకు స్వాగ‌తం ప‌లికేందుకే విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ నుంచి త‌ప్పుకున్నార‌ని ఇప్పుడు స్పష్టమైంది.

IPL 2024: రిషబ్ పంత్ వ‌చ్చేస్తున్నాడు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ గా గ్రౌండ్ లోకి రీఎంట్రీ.. !

 

Follow Us:
Download App:
  • android
  • ios