ఆ తరువాత ఇతర ఫ్రాంచైజీలు కూడా ఆగస్టు మూడవ లేదా నాలుగవ వారంలో యూఏఈకి చేరుకోనున్నాయి. ఈ టోర్నమెంట్ సన్నాహాల మధ్య టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ఫోటోను షేర్ చేశారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కొత్త లుక్ తో దర్శనమిస్తున్నాడు. తాజాగా... తెల్ల గడ్డంతో ఉన్న ఓ ఫోటోని షేర్ చేయగా.. ఆ ఫోటోని చూసి అభిమానులు షాకయ్యారు. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీపిఎల్) 13 వ సీజన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానుంది.
ఈ నేపధ్యంలో అన్ని ఫ్రాంచైజ్ జట్లు ఐపీఎల్ సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. వచ్చే వారం నుంచే జట్లు యూఏఈకి బయలుదేరనున్నాయి. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ ఆగస్టు 21 న దుబాయ్ బయలుదేరనుంది. ఆ తరువాత ఇతర ఫ్రాంచైజీలు కూడా ఆగస్టు మూడవ లేదా నాలుగవ వారంలో యూఏఈకి చేరుకోనున్నాయి. ఈ టోర్నమెంట్ సన్నాహాల మధ్య టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ఫోటోను షేర్ చేశారు.
ఈ ఫొటోలో అతను తెల్లబడిన గడ్డంతో కనిపిస్తున్నారు. విరాట్ ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఫోటో కింద మంచి ట్రైనింగ్ సెషన్ నాకు సంతోషాన్నిస్తోంది అని రాశారు. కాగా ఈ ఏడాది మార్చి 29 నుంచి ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కోవిడ్ -19 కారణంగా వాయిదా పడింది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు షార్జా, దుబాయ్, అబుధాబిలలో జరగనున్నాయి.
