కెప్టెన్ గా కోహ్లీ వరల్డ్ రికార్డు... టీ20ల్లో అరుదైన ఘనత
శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 25 పరుగులు దూరంలో ఉన్నాడు. అయితే, రెండో టీ20లో కోహ్లీ 17 బంతుల్లో 2 సిక్స్లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 30 పరుగులు చేశాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది. కెప్టెన్ గా ఆయన మరో రికార్డును సొంత చేసుకున్నాడు. ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లోనే కోహ్లీ వరల్డ్ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు అందుకున్న కెప్టెన్గా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక పేసర్ లిసత్ మలింగ బౌలింగ్లో సింగిల్ తీయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
AlsoRead టీ20 ప్రపంచ కప్ 2020: ధోనీ వేస్ట్, వీవీఎస్ లక్ష్మణ్ జట్టు ఇదే.
శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 25 పరుగులు దూరంలో ఉన్నాడు. అయితే, రెండో టీ20లో కోహ్లీ 17 బంతుల్లో 2 సిక్స్లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 30 పరుగులు చేశాడు. కాగా, ఈ జాబితాలో ధోని 62 మ్యాచ్ల్లో 1112 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. అంతేకాదు కోహ్లీ కేవలం 30 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో పాటు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన అటగాడిగా తన సహచర ఆటగాడు రోహిత్ శర్మను కూడా కోహ్లీ అధిగమించాడు.