Champions Trophy 2025: రికీ పాంటింగ్ విరాట్ కోహ్లీ సెంచరీని మెచ్చుకుంటూ, అతను చూసిన బెస్ట్ వన్డే ప్లేయర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. 

Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్, వరల్డ్ కప్ విన్నింగ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌పై ఆడిన సెంచరీ ఇన్నింగ్స్ ను మెచ్చుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తాను చూసిన "బెస్ట్ వన్డే ప్లేయర్" అని పొగిడాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ చేశాడు. ఇది విరాట్ మొదటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీ. దీనితో ఇండియా గెలవడమే కాకుండా 14,000 వన్డే రన్స్ పూర్తి చేశాడు. పాంటింగ్‌ పరుగుల రికార్డును బద్దలు కొడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల ప్లేయర్ల లిస్టులో మూడవ స్థానానికి చేరుకున్నాడు.

అవసరమైన సమయంలో కోహ్లీ అదరగొడతాడు : పాంటింగ్

ఐసీసీ రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ టీమ్ కు అవసరమైన సమయంలో మంచి ఇన్నింగ్స్ లను ఆడతాడని కొనియాడాడు. కోహ్లీ కీలక సమయాల్లో రాణించే సత్తాను, రికార్డులు బద్దలు కొట్టే విధానాన్ని పాంటింగ్ మెచ్చుకున్నాడు. "నేను ఎప్పుడూ చెబుతుంటా.. పెద్ద మ్యాచ్‌లు అంటే పెద్ద ప్లేయర్లు రాణించాలి. అలాంటి టైమ్‌లో మీ పెద్ద ప్లేయర్లు నిలబడాలి. ఇండియాకు పాకిస్తాన్‌తో మ్యాచ్ కంటే పెద్దది ఏముంటుంది?" అని పాంటిగ్ అన్నాడు. "అంతర్జాతీయ వేదికపై మీరు ఏం చేస్తారనే దానిపైనే మీ పేరు ఆధారపడి ఉంటుంది. అందుకే ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు" అని కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు చేయడం అతని టెంపర్‌మెంట్‌కు నిదర్శనమని చెప్పాడు.

మెల్‌బోర్న్‌లో కూడా కింగ్ కోహ్లీ గెలిపించాడు.. 

2022 టీ20 వరల్డ్ కప్‌లో మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌పై ఆడిన కోహ్లీ ఇన్నింగ్స్‌ను గుర్తు చేశాడు. అప్పుడు కూడా ఇండియా గెలిచింది. "అవును, 2022లో, ఇప్పుడు కూడా,  కోహ్లీ బాగా ఆడాలని నిర్ణయించుకున్నాడు. టీమ్ కోసం నిలబడ్డాడు" అని పాంటింగ్ అన్నాడు. "పాకిస్తాన్ బ్యాటింగ్ చేసిన తర్వాత, భారత టాప్ ఆర్డర్‌లో ఒక మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కోహ్లీ ఆ పని చేశాడని" చెప్పాడు. పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. ఇది పోటీ ఇచ్చే స్కోరులా అనిపించింది కానీ ఇండియా బ్యాటింగ్ ముందు తక్కువైపోయిందనీ, పాకిస్తాన్‌లో చాలామందికి స్టార్ట్ వచ్చినా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఇదే వాళ్ళ ఓటమికి కారణమని పాంటింగ్ చెప్పాడు. సౌద్ షకీల్ (62), మహ్మద్ రిజ్వాన్ (46), ఖుష్‌దిల్ షా (38) పరుగులు చేశారు, కానీ ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదని చెప్పాడు.

భారత్ కు పాకిస్తాన్ ఇన్నింగ్స్ ల తేడా అదే.. అందుకే పాక్ ఓటమి : పాంటింగ్

రెండు జట్ల ఇన్నింగ్స్ లను విషయాలను కూడా పాంటింగ్ ప్రస్తావించారు. "రెండు స్కోర్‌కార్డ్‌లు చూస్తే, విరాట్ 100 కొట్టాడు, పాకిస్తాన్‌లో చాలామంది మంచిగానే స్టార్ట్ చేశారు కానీ ఎవరూ పెద్ద స్కోరు చేయలేదు" అని పాంటింగ్ అన్నాడు. "ఏ ఫార్మాట్‌లో అయినా 50 కొడితే గెలవలేం. పెద్ద స్కోర్లు చేయాలి. పాకిస్తాన్ లో ఇన్నింగ్స్ లో పెద్ద ఇండివిడ్యువల్ స్కోర్లు లేవు, పార్టనర్‌షిప్‌లు కూడా లేవని" అన్నారు. కుల్దీప్ యాదవ్ (3/40), హార్దిక్ పాండ్యా (2/31) పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 242 ఛేజింగ్‌లో ఇండియా తొందరగా వికెట్లు కోల్పోయింది, కానీ కోహ్లీ నిలకడగా ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ (56)తో కలిసి మంచి పార్టనర్‌షిప్ నెలకొల్పి ఇండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ తన సెంచరీతో పాంటింగ్ ను అధిగమిస్తూ 14 వేల పరుగుల రికార్డును అందుకున్నాడు. కోహ్లీ కంటే కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ మాత్రమే ముందున్నారు. "విరాట్ కోహ్లీ కంటే మంచి 50 ఓవర్ల ప్లేయర్‌ను నేను చూడలేదు. అతను నన్ను దాటేశాడు. ఇప్పుడు అతని కంటే ఇద్దరు మాత్రమే ముందున్నారు. అతను ఆల్-టైమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలవాలని అనుకుంటాడు.. అతనికి పరుగుల ఆకలి ఉన్నంత వరకు, అతను ఫిట్‌గా ఉంటాడు. తన ఆటపై చాలా కష్టపడతాడు" అని కోహ్లీపై పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు.

ఇవి కూడా చదవండి:

క్రికెట్ అంపైర్ల జీతం: ఒక్కో మ్యాచ్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ఇబ్రహీం జద్రాన్ విధ్వంసంతో సచిన్, గంగూలీ రికార్డులు బ్రేక్