Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: షమీపై తప్పుడు ప్రచారం వెనక పాకిస్తాన్..?

షమీ కావాలనే మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని.. పాక్ విజయానికి సహకరించడంటూ నెట్టింట ట్రోల్ చేశారు.  అయితే.. ఈ ప్రచారం పాకిస్తాన్  నుంచే మొదలైందని తెలుస్తోంది.

T20 World Cup 2021: 'Pakistan behind disinformation campaign against Mohammad Shami'
Author
Hyderabad, First Published Oct 28, 2021, 11:36 AM IST

T20 Worldcup హుషారుగా జరుగుతోంది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా.. ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో.. విజయం పాకిస్తాన్ కే  దక్కింది. అందరూ భారత్ విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పాక్ కి విజయం దక్కింది. అయితే.. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించడానికి టీమిండియా క్రికెటర్ షమీ కారణంటూ నెట్టింట విమర్శలు మొదలయ్యాయి.

షమీ కావాలనే మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని.. పాక్ విజయానికి సహకరించడంటూ నెట్టింట ట్రోల్ చేశారు.  అయితే.. ఈ ప్రచారం పాకిస్తాన్  నుంచే మొదలైందని తెలుస్తోంది.

ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత షమీ ఆన్‌లైన్‌లో దుర్భాషలాడాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే, అభిమానులు ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్‌లో షమీపై విమర్శలు చేశారు.

ఈ ట్రోల్స్ అన్నీ పాకిస్తాన్ కి చెందినవారే చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కావాలని ధ్వేషం వెదజల్లాలనే కారణంతోనే.. ఇలా చేసినట్లు తెలుస్తోంది. 

టీమిండియాలోని ముస్లిం క్రికెటర్ అయిన షమీపై ఆన్ లైన్ లో వేదింపులకు గురి చేశారని..  ఎనిమింది ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను గుర్తించారని.. వాటి నుంచే ఈ ఫేక్ ప్రచారం మొదలైందని గుర్తించినట్లు తెలుస్తోంది.

కాగా.. షమీపై ట్రోల్స్ ని అందరూ ఖండించారు. ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ లో టీమిండియా (Team India) దారుణ పరాభవాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కొంతమంది  అభిమానులు  ఆ వేదనను భరిస్తుంటే మరికొంత మంది  మాత్రం ఆన్లైన్ వేదికగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. టీమిండియాకు, ముఖ్యంగా భారత పేసర్ మహ్మద్ షమీ (Mohammad Shami)కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. 

అతడిని పాకిస్థాన్ (Pakistan) కు వెళ్లిపోవాలని అభ్యంతరకరమైన పోస్టులు షేర్ చేస్తున్నారు.  షమీ మతాన్ని వేలెత్తి చూపుతూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు. అతడి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇందులోకి లాగుతున్నారు. 

మరోవైపు షమీకి మద్దతుగా భారత సీనియర్ క్రికెటర్లు నిలుస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సెహ్వాగ్ (Virender Sehwag), గంభీర్ (Gowtham Gambhir), ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan), యుజ్వేంద్ర చాహల్ వంటి వాళ్లు షమీకి బాసటగా నిలిచారు. ఇక తాజాగా క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) కూడా షమీకి మద్దతుగా నిలిచాడు. షమీని ట్రోల్ చేస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Jo log Mohammad Shami ke baare mein ghatiya baaten kar rahe hain, unse meri ek hi vinanti hai. Aap cricket na dekhen. Aur aapki kami mehsoos bhi nahi hogi. #Shami #355WicketsforIndia.

— Harsha Bhogle (@bhogleharsha) October 25, 2021
భోగ్లే స్పందిస్తూ.. ‘మహ్మద్ షమీ గురించి అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్లందరికీ నా వినతి. మీరు క్రికెట్ చూడకండి. అప్పుడు మీరు ఏదీ మిస్ అవ్వరు’ అని ట్వీట్ చేశాడు. 

పాక్ పై మ్యాచ్ ఓడిపోగానే పలువురు ఆకతాయిలు షమీ ఇన్స్టాగ్రామ్ కు.. ‘సర్ టీమిండియా ఓడిపోయింది, అయితే మీరు సంతోషిస్తూ ఉండొచ్చు. మీ వాళ్ల టీమ్ గెలిచింది కదా... సారీ మీరే గెలిపించారు...’ అంటూ తీవ్రంగా దూషిస్తూ, అసభ్యపదజలంతో మహ్మద్ షమీపై దాడికి పాల్పడుతున్నారు.  

When we support #TeamIndia, we support every person who represents Team India. @MdShami11 is a committed, world-class bowler. He had an off day like any other sportsperson can have.

I stand behind Shami & Team India.

— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2021


The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.

— Virender Sehwag (@virendersehwag) October 25, 2021
షమీకి అండగా నిలిచిన సచిన్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘మేం టీమిండియాకు  మద్దతుగా నిలవడం అంటే జట్టులోని ప్రతి ఆటగాడికి మద్దతు తెలిపినట్టే. షమీ అంకితభావం ఉన్న ప్రపంచస్థాయి బౌలర్. మిగతా క్రికెటర్ల లాగే అతడు కూడా ఒక రోజు విఫలమయ్యాడు. షమి, టీమిండియాకు నేను మద్దతుగా నిలుస్తున్నా’ అని రాసుకొచ్చాడు. 

Even I was part of #IndvsPak battles on the field where we have lost but never been told to go to Pakistan! I’m talking about 🇮🇳 of few years back. THIS CRAP NEEDS TO STOP. #Shami

— Irfan Pathan (@IrfanPathan) October 25, 2021


We are so proud of you @MdShami11 bhaiya 🇮🇳

— Yuzvendra Chahal (@yuzi_chahal) October 25, 2021
ఇక వీరూ స్పందిస్తూ.. ‘మహ్మద్ షమీపై జరుగుతున్న ఆన్‌లైన్ అటాక్ చూసి షాక్ అయ్యా. మేం నీతో ఉన్నాం. నువ్వు ఓ ఛాంపియన్‌వి. భారత జెర్సీ వేసుకుని, టీమిండియా క్యాప్ పెట్టుకునే ప్రతీ ప్లేయర్‌ను ఇండియా తన గుండెల్లో పెట్టుకుని చూసి ఉంటుంది. ఇలాంటి ఆన్‌లైన్ హింసలు, వారిని ఏమీ చేయలేవు. నీతో ఉన్నా షమీ... తర్వాతి మ్యాచ్‌లో నువ్వేంటో వీళ్లకు చూపించు...’ అంటూ ట్వీట్ చేశాడు. 

Mohammed Shami has been a stellar performer for India for eight years, playing a significant role in many a victory. He can't be defined by one performance. My best wishes are always with him. I urge fans & followers of the game to support @MdShami11 and the Indian team.

— VVS Laxman (@VVSLaxman281) October 25, 2021


355 International wickets. It is India that beats in the heart of anyone representing India. And Mohammad Shami has been an outstanding and yet unsung servant of Indian cricket. More power to him.

— Venkatesh Prasad (@venkateshprasad) October 25, 2021
ఆదివారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 151 పరుగులు చేసింది. 152 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన పాక్.. 18 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో షమీ 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. తొలి మూడు ఓవర్లు బాగానే వేసిన షమీ.. ఆఖరి ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే ఇప్పుడు అతడి పాలిట శాపమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios