టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీకి జట్టుకి ప్రకటించిన సౌతాఫ్రికా... డుప్లిసిస్, క్రిస్ మోరిస్లకు నిరాశ...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టుకి కెప్టెన్గా తెంబ భవుమా... సీనియర్లు ఫాఫ్ డుప్లిసిస్, క్రిస్ మోరిస్, ఇమ్రాన్ తాహీర్లకు దక్కని చోటు...
టీ20 వరల్డ్కప్ 2021 మెగా టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఓమన్ వంటి దేశాలు, ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించినా... తాజాగా సౌతాఫ్రికా కూడా టీ20 వరల్డ్కప్ ఆడే జట్టును ప్రకటించింది...
కొన్నాళ్లుగా సరైన విజయాలు అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్న దక్షిణాఫ్రికా జట్టును తెంబ భవుమా టీ20 వరల్డ్కప్ టోర్నీలో కెప్టెన్గా నడిపించబోతున్నాడు. క్వింటన్ డి కాక్ను వికెట్ కీపర్గా ఎంపిక చేసిన సఫారీ క్రికెట్ బోర్డు... లుంగి ఇంగిడి, నోకియా, రబాడా వంటి స్టార్ పేసర్లతో పాటు షంసీ వంటి వరల్డ్ నెం.1 టీ20 స్పిన్నర్కి కూడా వరల్డ్కప్ ఆడే జట్టులో చోటు కల్పించింది...
అయితే దక్షిణాఫ్రికా సీనియర్ స్టార్ ఫాఫ్ డుప్లిసిస్, క్రిస్ మోరిస్, ఇమ్రాన్ తాహీర్లకు టీ20 వరల్డ్కప్ ఆడే జట్టులో చోటు దక్కలేదు. తొలుత ప్రకటించిన 30 మంది జట్టులో వీరికి చోటు కల్పించిన సఫారీ క్రికెట్ బోర్డు, తుది 15 మంది జాబితా నుంచి సీనియర్లను తొలగించింది...
టీ20 వరల్డ్కప్ 2021కి సౌతాఫ్రికా జట్టు ఇది: భువుమా, కేశవ్ మహరాజ్, క్వింటన్ డి కాక్, జోర్న్ ఫోర్టిన్, రిజా హెండ్రిక్స్, హెండ్రిచ్ క్లాసెన్, ఆడెన్ మార్కమ్, డేవిడ్ మిల్లర్, ముల్దర్, లుంగి ఇంగిడీ, నోకియా, డ్వైన్ ప్రీటోరియస్, కగిసో రబాడా, షంసీ, రస్సీ వాన్ డేర్ దుస్సేన్
రిజర్వు ప్లేయర్లుగా అండిలే ఫిలుక్వాయో, జార్జ్ లిండే, లిజాడ్ విలింయసన్లకు చోటు దక్కింది.