సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ... ముంబైలో ప్రాక్టీస్ సెషన్స్‌లో రోహిత్‌కి గాయం, టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరం... రోహిత్ స్థానంలో ప్రియాంక్ పంచల్‌కి చోటు...

సౌతాఫ్రికా టూర్‌కి సిద్ధమవుతున్న భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది. మరో మూడు రోజుల్లో సఫారీ పర్యటనకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడి, టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు... రోహిత్ శర్మ స్థానంలో భారత్-ఏ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రియాంక్ పంచల్‌కి టెస్టు సిరీస్‌లో అవకాశం కల్పించారు సెలక్టర్లు...

Read: పెళ్లికి ముందు విరాట్ కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?... రితికా కారణంగానే ఆ ఇద్దరి మధ్య...

సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ప్రియాంక్ పంచల్, భారత్-ఏ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు... గుజరాత్ రాష్ట్రానికి చెందిన 31 ఏళ్ల ప్రియాంక్ పంచల్, 98 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 24 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలతో 6891 పరుగులు చేశాడు. ఇందులో ఓ త్రిబుల్ సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీలో ఒకే సీజన్‌లో 1000 పరుగులు చేసిన ప్రియాంక్ పంచల్‌‌, ఇంగ్లాండ్ టూర్‌లో స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నాడు..

రోహిత్ శర్మ గాయం కారణంగా అర్ధాంతరంగా తప్పుకోవడంతో ప్రియాంక్ పంచల్‌కి లక్కీగా టీమిండియా నుంచి పిలుపు దక్కింది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్ కోసం ఇప్పటికే భారత జట్టు, ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫైవ్ స్టార్ హోటెల్‌లో క్వారంటైన్ గడుపుతోంది. మూడు రోజుల పాటు సాగే క్వారంటైన్ ముగిసిన తర్వాత ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్‌లో నేరుగా జోహాన్‌బర్గ్ చేరుకునే భారత జట్టు, అక్కడ మరో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో గడుపుతుంది...

Scroll to load tweet…

ఆ తర్వాత ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొని, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ టెస్టు ఆడుతుంది. ఈ సిరీస్‌కి టెస్టు వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్న విషయం తెలిసిందే... వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మను టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఏడాదిగా ఫెయిల్ అవుతున్న అజింకా రహానేను ఆ బాధ్యతల నుంచి తప్పించింది...

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొనని రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్‌‌లతో పాటు మొదటి టెస్టులో గాయపడిన అజింకా రహానే... కొన్నిరోజులుగా ముంబైలో బీసీసీఐ మినీ క్యాంపులో పాల్గొంటున్నారు... భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆధ్వర్యంలో ఈ ప్లేయర్లు, ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లోనే రోహిత్ శర్మకు తీవ్ర గాయం అయ్యింది...

ఇప్పటికే గాయాల కారణంగా చాలా సార్లు సిరీస్‌లకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. 2020 ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి రెండు టెస్టులు ఆడలేదు... సౌతాఫ్రికా టూర్‌లో వైస్ కెప్టెన్‌గా, వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న సమయంలో రోహిత్ శర్మ, మరోసారి గాయపడడంతో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

అయితే రోహిత్ శర్మ ఫిట్‌గా ఉన్నాడని, ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన త్వరగానే కోలుకున్నాడని మొదటి టెస్టు సమయానికి జట్టుకి అందుబాటులో వార్తలు వినిపించినా, అతని గాయం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అంచనా వేసిన వైద్యులు, టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు...

Read also: శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానే కంటే అతనికి అవకాశం ఇవ్వండి... సౌతాఫ్రికా టూర్‌లో నిరూపించుకున్న...

ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపుకి విరాట్ కోహ్లీ ఇలా రాలేదని సమాచారం. నేడు, లేదా రేపు విరాట్ కోహ్లీ క్వారంటైన్‌లో చేరతాడని సమాచారం...
అన్ని విషయాల్లో అందరికంటే ముందు ఉండే విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా టూర్‌కి ముందు ఇలా లేటు చేయడానికి బీసీసీఐ వన్డే కెప్టెన్సీ విషయంలో వ్యవహరించిన తీరు నచ్చకపోవడమే అంటున్నారు అభిమానులు...