RCB vs DC: యువ ‘ఢిల్లీ’ మెరుపులు... కోహ్లీ సేన ముందు ‘భారీ’ స్కోరు...
పృథ్వీషా, శిఖర్ ధావన్, పంత్ మెరుపులు...
మరోసారి మెరుపు హాఫ్ సెంచరీ చేసిన స్టోయినిస్...
2 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్...
IPL 2020 సీజన్లో మరోసారి భారీ స్కోరు చేసింది యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ మంచి ఆరంభం ఇవ్వగా... వెంటవెంటనే మూడు వికెట్లు తీసి స్కోరు వేగాన్ని తగ్గించింది ఆర్సీబీ. అయితే మిడిల్ ఓవర్లలో స్టోయినిస్, రిషబ్ పంత్ చెలరేగడంతో భారీ స్కోరు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.
ఓపెనర్ పృథ్వీ షా 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 28 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 11 పరుగులకే పెవిలియన్ చేరినా స్టోయినిస్, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు.
25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసిన రిషబ్ పంత్, సిరాజ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ కాగా... స్టోయినిస్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.