Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ శర్మ ఫ్యాన్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అశ్విన్...  ట్రోల్ చేసేందుకు చూసి...

‘ఇడ్లీ సాంబార్’ అని కామెంట్ చేసి రవిచంద్రన్ అశ్విన్‌ని ట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ అభిమాని... స్ట్రాంగ్ రిప్లైతో నోరుమూయించిన అశ్విన్.. 

Ravichandran ashwin gives savage reply to Rohit Sharma fan, who tried to troll
Author
First Published Dec 1, 2022, 1:28 PM IST

టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏ రకమైన విమర్శలు వచ్చినా వాటికి తన స్టైల్‌లో సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పడం రవిచంద్రన్ అశ్విన్ స్పెషాలిటీ. ఐపీఎల్ 2019లో మన్కడింగ్ రనౌట్ విషయంలో వివాదం రేగినప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ ప్రపంచమంతా ఒక్కటై రవిచంద్రన్ అశ్విన్ ‘క్రీడాస్ఫూర్తి’ని వేలెత్తి చూపించినా... వారందరికీ తానొక్కడే ఒంటరిగా సమాధానం చెప్పి నోళ్లు మూయించాడు...

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రవిచంద్రన్ అశ్విన్, క్రికెట్‌కి బ్రేక్ దొరికినప్పుడల్లా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తూ ఉంటాడు. 2020-21 ఆస్ట్రేలియా టూర్ సమయంలో ‘కుట్టీ పార్టీ’ పేరుతో రవిచంద్రన్ అశ్విన్ చేసిన వీడియోల సిరీస్‌కి మంచి ఆదరణ దక్కింది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌ సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్, ఈ నెలలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ టూర్‌లో పాల్గొనబోతున్నాడు. తాజాగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ గురించి ట్వీట్ చేశాడు అశ్విన్. ‘స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, మురళీ కార్తీక్, జహీర్ ఖాన్ కలిసి చాలా చక్కగా మాట్లాడారు. న్యూజిలాండ్‌ జట్టు, భారత పర్యటనకి వచ్చినప్పుడు స్పిన్ పిచ్‌లు తయారుచేశారని ఫ్లెమ్మింగ్ అన్నాడు. దానికి మనవాళ్లు, 2002 సిరీస్‌లో డానియల్ విటోరీ ఒక్క ఓవర్ కూడా వేయలేదని గుర్తు చేసి నోరు మూయించారు...’ అంటూ ట్వీట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

దీనికి రోహిత్ శర్మ అని పేరుతో ఉన్న ఓ నెటిజన్... ‘అన్నా వన్ ప్లేట్ ఇడ్లీ సాంబార్’ అని కామెంట్ చేశాడు. రోహిత్ శర్మ పేరుతో పాటు క్రికెటర్ రోహిత్ ఫోటోనే ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. దీంతో అతను ముంబై వాడని తేల్చేసిన రవిచంద్రన్ అశ్విన్... ‘వడా?...’ అంటూ రిప్లై ఇచ్చాడు...

అశ్విన్ తమిళుడు కావడంతో ‘ఇడ్లీ సాంబార్’ అని ట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన అభిమాని... ‘వడాపావ్’ పేరు చెప్పి కౌంటర్ రిప్లైతో నోరు మూయించాడు. ఈ కామెంట్ వైరల్ కావడంతో సదరు రోహిత్ శర్మ అభిమాని, తన ప్రొఫైల్ పేరును తొలగించి, ప్రొఫైల్ పిక్‌గా గుండుతో మార్ఫింగ్ చేసిన మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పోస్ట్ చేయడం విశేషం..

ఎవరినైనా ట్రోల్ చేయొచ్చు కానీ ఫైర్ బ్రాండ్ రవిచంద్రన్ అశ్విన్‌ని ట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం రిజల్ట్ ఇలాగే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరికొందరు మాత్రం ‘వడా..’ అని కామెంట్ చేసి అశ్విన్, రోహిత్ శర్మ కూడా ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశాడని ఆరోపిస్తున్నారు... 

Follow Us:
Download App:
  • android
  • ios