పాక్ పై ఇండియా విజయం : కోహ్లీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు... ప్రధాని మోడీ ట్వీట్...
టీ20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారత్ ఘన విజయం సాధించడంతో రాజకీయప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా కోహ్లీకి ప్రత్యక అభినందనలు తెలుపుతున్నారు.
కోల్కతా : మెల్బోర్న్లో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. దీంతో విరాట్ కోహ్లీ మీద ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే... ప్రధాని నరేంద్ర మోడీ.. "భారత జట్టు బాగా పోరాడి విజయం సాధించింది. ఈ రోజు అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు అభినందనలు. అద్భుతమైన ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు. విరాట్ అద్భుతమైన పట్టుదలను ప్రదర్శించాడు. రాబోయే ఆటలకు శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.
ఈరోజు అద్భుతమైన విజయంపై వ్యాఖ్యానిస్తూ కోహ్లీ స్వయంగా "ఇది జరుగుతుంది" అని చెప్పాడు. దీనిమీద అనేకమంది రాజకీయ నాయకులు భారత మాజీ కెప్టెన్ ఆటను... అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత జట్టు రిలిసెన్స్ ను ప్రశంసలతో ముంచెత్తారు. దీపావళి సంబరాలకు నాంది పలికిన భారత విజయాన్ని అభినందిస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు : "T20 ప్రపంచ కప్ను ప్రారంభించడానికి సరైన మార్గం. దీపావళి ప్రారంభమయ్యింది. @imVKohli ద్వారా అద్భుతమైన ఇన్నింగ్స్. మొత్తం జట్టుకు అభినందనలు" అని ట్వీట్ చేశారు.
నేను ఎందుకు డ్యాన్స్ చేశానో నా కూతురికి అర్థం కాలేదు.. భర్త విజయంపై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్....
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ "అంత ఒత్తిడిలో భారత్ సాధించిన గొప్ప విజయాలలో ఒకటి" అని పేర్కొన్నారు. టోర్నమెంట్లో రాబోయే మ్యాచ్లకు జట్టుకు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ "పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించిన టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు" అని తెలియజేశారు. ఒక ట్వీట్లో, తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఇలా రాశారు: "పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించినందుకు టీం ఇండియాకు హృదయపూర్వక అభినందనలు. మన క్రికెటర్ల ప్రదర్శన చూడటానికి నిజంగా ఆనందంగా ఉంది" అన్నారు.
తాను ఈ ఉదయం గోవా నుండి విమానం ప్రయాణం చేయాల్సి ఉండగా.. టెలివిజన్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను మిస్ కావడం ఇష్టం లేకనే రాత్రి 9.55 గంటలకు తన ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నానని... కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చెప్పారు. ఈ టోర్నమెంట్లోని గొప్ప మ్యాచ్లలో ఒకదాన్ని చూసినందుకు థ్రిల్గా ఉన్నానని ట్వీట్ చేశాడు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, T20 ప్రపంచ కప్ ప్రచారంలో తమ ప్రారంభ మ్యాచ్లో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించినందుకు కోహ్లీ, టీమ్ ఇండియాను అభినందిస్తూ, టోర్నమెంట్ను గెలవడానికి భారత్ ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "విరాట్ అద్భుతమైన ఆట పాకిస్థాన్పై భారత్ అద్భుతమైన విజయానికి దారితీసింది. ప్రపంచ టీ20లో భారత్ విజయాన్ని ప్రారంభించినందుకు టీమ్ ఇండియాకు, దేశప్రజలందరికీ అభినందనలు. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ ప్రపంచకప్ను కూడా గెలుస్తాం" అని ట్వీట్ చేశాడు.
మ్యాచ్ చివరి బంతికి భారత్ విజయంపై ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా స్పందిస్తూ, "భారత్కు ఇంతటి కష్టతరమైన మ్యాచ్ తర్వాత ఇది అసాధారణ విజయం" అని అన్నారు. ఒక ట్వీట్లో, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇలా అన్నారు: "అభినందనలు, టీమ్! దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి, ఈ రోజు మైదానంలో మీ మెరుపుకు ధన్యవాదాలు. మెరుస్తూ ఉండండి" అంటూ ట్వీట్ చేశారు.