దుబాయ్లో పాండ్యా బ్రదర్స్తో కలిసి స్టెప్పులేసిన ఎంఎస్ ధోనీ... పబ్లో రచ్చలేపిన మాహీ...
దుబాయ్లో ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన మహేంద్ర సింగ్ ధోనీ... హార్ధిక్ పాండ్యాతో కలిసి క్రేజీ స్టెప్పులు... వీడియో పోస్టు చేసిన సాక్షి సింగ్...
మాహీ ఏం చేసినా సంచలనమే. ఐపీఎల్ కోసం గుండుతో సన్యాసిలా అవతారం ఎత్తినా, ఓరియో ప్రమోషన్ కోసం అభిమానులకు ‘బిస్కెట్’ వేసినా... అది మహేంద్రుడికే చెల్లింది. టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు...
ఐపీఎల్ 2020 తర్వాత దుబాయ్కి ఎక్కువగా వెళ్లి వస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, రెండేళ్లుగా బర్త్ డే కూడా అక్కడే చేసుకుంటున్నాడు. భార్య సాక్షి సింగ్ బర్త్ డే కూడా దుబాయ్లోనే సెలబ్రేట్ చేసిన మాహీ... తాజాగా తన ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం దుబాయ్లో అడుగుపెట్టాడు...
తన బంధువు, స్నేహితుడి బర్త్ డే పార్టీలో పాల్గొన్న ధోనీ... టీమిండియా ఆల్రౌండర్ బ్రదర్స్ హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి డ్యాన్స్ ఫ్లోర్లో స్టెప్పులేశాడు. ర్యాపర్ బాద్షా పాట పాడుతుంటే హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ల మీద చేతులేసి మాహేంద్ర సింగ్ ధోనీ స్టెప్పులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... ఈ వీడియో తీసిన మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీగా పోస్టు చేసింది...
ఐపీఎల్ 2022 టోర్నీలో గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, తొలి సీజన్లో టైటిల్ గెలిచి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అండర్ డాగ్స్గా ఎలాంటి అంచనాలు లేకుండా 2022 సీజన్ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిస్తే... డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది...
సీజన్ ఆరంభంలో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జడేజా కెప్టెన్సీలో 2022 ఐపీఎల్ ఎడిషన్ని ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్, 8 మ్యాచులు ముగిసిన తర్వాత మళ్లీ కెప్టెన్ని మార్చింది. రవీంద్ర జడేజా స్థానంలో ధోనీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఓవరాల్గా 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని, నాలుగు విజయాలతో సరిపెట్టుకున్న సీఎస్కే... పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది...
ఐపీఎల్ 2023 సీజన్లోనూ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో బరిలో దిగబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటికే సీఎస్కే ఈ విషయాన్ని ఖరారు చేసింది. అయితే 2023 సీజన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. 2020 ఐపీఎల్ సీజన్ నుంచే మాహీ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నా... రెండు సీజన్లు ఆడిన ధోనీ... 2023 తర్వాత మెంటర్గా మారబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కి కెప్టెన్గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్... వన్డే సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయారు. ఈ ఇద్దరూ నేరుగా దుబాయ్ చేరుకుని, ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు.