MIvsRR: ముంబై భారీ స్కోరు... రాజస్థాన్ ముందు బిగ్ టార్గెట్...
సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ...
డి కాక్, రోహిత్ శర్మ మెరుపులు...
తొలి ఓవర్లో వికెట్ తీసిన యంగ్ బౌలర్ కార్తీక్ త్యాగి...
IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఓపెనర్లు డి కాక్, రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో మొదటి 4.5 ఓవర్లలో 49 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. అయితే 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 23 పరుగులు చేసి అవుట్ కాగా... రోహిత్ శర్మ 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఇషాన్ కిషన్ భారీ షాట్కి ప్రయత్నించి డకౌట్ కాగా... కృనాల్ పాండ్యా 12 పరుగులు చేశాడు. వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 30 పరుగులు చేశాడు.
శ్రేయాస్ గోపాల్ 2 వికెట్లు తీయగా, కార్తీక్ త్యాగి, ఆర్చర్ చెరో వికెట్ తీశారు..