MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 లో మరో బిగ్ ఫైట్ లో ముంబయి ఇండియన్స్ (MI) - పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ (PBKS) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ (MI) మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ విజేత జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది.
ఈ మ్యాచ్కు ముందు మోతేరా మెట్రో స్టేషన్, నరేంద్ర మోడీ స్టేడియం వద్ద భారీ గందరగోళం చోటు చేసుకుంది. ముంబయి ఇండియన్స్ జట్టు జెర్సీలు ఉచితంగా పంపిణీ చేయడంతో, అభిమానులు పెద్ద సంఖ్యలో రాగా, గేటు-1 వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అభిమానులు సెల్ఫీలు తీసుకుంటూ, తమ జట్లకు మద్దతుగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ మ్యాచ్ లో రెండు జట్లలో మార్పులు జరిగాయి. చాహల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా ఆయన గత మూడు మ్యాచ్లకు దూరంగా ఉన్నారు. రీస్ టాప్లీ ఈ మ్యాచ్ ద్వారా ముంబయి తరఫున అరంగేట్రం చేస్తున్నారు. రిచర్డ్ గ్లీసన్ గాయంతో జట్టు నుంచి అవుట్ అయ్యాడు. కాగా, ప్రస్తుతం వర్షం పడటంతో మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. టాస్ పడిన తర్వాత వర్షం పడటం ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే, లీగ్ దశలో టాప్ లో నిలిచిన పంజాబ్ టీమ్ ఫైనల్ కు చేరుకుంటుంది.
పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI వివరాలు
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్ సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైలే జేమిసన్, విజయ్కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
ముంబయి ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా, రీస్ టాప్లీ.
పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది?
నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు సహాయం లభించవచ్చు. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 42 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి, అందులో మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన జట్లు 21 విజయాలు సాధించాయి. రెండవ ఇన్నింగ్స్లో కూడా 21 గెలుపులు నమోదయ్యాయి. అయితే, ఈ సీజన్ లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన జట్లే అత్యధిక సార్లు గెలిచాయి. ఈ వేదికపై గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 243/5 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేసింది.