సారాంశం
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడ్డ ముంబై ఇండియన్స్ సొంత గ్రౌండ్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ జట్టు కేకేఆర్పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది..
వాఖండే వేదికగా సోమవారం కోల్కతా నైట్రైడర్స్తో రిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయాన్ని అందుకుంది. 8 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ కోల్కతాను 116 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మొదటి నుంచి డామినేట్గా ఆడింది.
కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 62 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మ్యాచ్ను ఫినిష్ చేశాడు.
ఇక కోల్కత బ్యాటింగ్ విషయానికొస్తే అంగ్క్రిష్ రఘువంశీ ఒక్కడే అత్యధికంగా 26 పరుగులు చేయగా, రమణ్దీప్ సింగ్ 22 పరుగులు చేశాడు. ఆరుగురు ప్లేయర్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో అశ్వని కుమార్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ముంబై తరపున అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల యంగ్ ప్లేయర్ తొలి మ్యాచ్లోనే ఏకంగా 4 వికెట్లు తీశాడు.
మొత్తం 3 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును అందుకున్నాడు తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే 4 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. మొదటి మ్యాచ్ లోనే 4 వికెట్లు పడగొట్టిన అశ్వని కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.