ఉత్త చేతులతో వచ్చారు..ఉత్త చేతులతోనే వెళ్లారు.. ఇంగ్లాండ్ పై సెహ్వాగ్ ట్రోల్స్
ఈ మ్యాచ్ విజయంతో వన్డే సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. ఇవి మాత్రమే కాదు.. టెస్టు, టీ 20 సిరీస్ లు కూడా భారతే గెలిచింది. దీంతో... ఇంగ్లాండ్ ఎలా వచ్చిందో.. అలానే స్వదేశానికి వెళ్లింది.
ఇండియన్ మాజీ క్రికెటర్, లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇంగ్లాండ్ జట్టుని ట్రోల్ చేశాడు. కాగా.. ఆయన ట్రోల్ చేసిన విధానం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో వన్డే సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. ఇవి మాత్రమే కాదు.. టెస్టు, టీ 20 సిరీస్ లు కూడా భారతే గెలిచింది. దీంతో... ఇంగ్లాండ్ ఎలా వచ్చిందో.. అలానే స్వదేశానికి వెళ్లింది.
ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేశాడు. ‘ సామ్ కర్రాన్ లో చాలా టాలెంట్ ఉంది. ఇంగ్లాండ్ ని గట్టెక్కించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.. కానీ.. ఇంగ్లాండ్ జట్టు ఖాళీ చేతులతో వచ్చి.. ఖాళీ చేతులతోనే వెళ్లిపోయారు. టీమిండియాకు శుభాకాంక్షలు. అయితే.. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాకు ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది.’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. సామ్ కర్నన్ నిన్నటి మ్యాచ్ లో 95 పరుగులు చేసి జట్టు కి సహకరించాడు. కానీ.. ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించడంతో.. సామ్ కర్నన్ పరుగులు వృథా అయ్యాయి.