67 పరుగులు చేసిన ఆటపట్టు... 31 పరుగులు చేసిన హర్మన్ప్రీత్ కౌర్... 30 పరుగులు చేసిన ప్రియా పూనియా...
JIO వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్... భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది సూపర్ నోవాస్. ఓపెనర్లు ప్రియా పూనియా, చమేరీ ఆటపట్టు దూకుడుగా ఆడి మొదటి వికెట్కి 89 పరుగులు జోడించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ప్రియా పూనియా 30 పరుగులు చేయగా, ఆటపట్టు 48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసింది. యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 1 పరుగుకే అవుట్ కాగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 31 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఏకంగా ముగ్గురు బ్యాట్స్వుమెన్ రనౌట్ అయ్యారు.
స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రైయల్ బ్లేజర్స్... ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే సూపర్ నోవాస్ ఫైనల్కి అర్హత సాధించదు.
