IPL2021 RR vs MI: 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...
ముంబై ఇండియన్స్కి కలిసి వచ్చిన మార్పులు... రెండేసి వికెట్లు తీసిన జేమ్స్ నీశమ్, నాథన్ కౌంటర్నైల్...పీకల్లోతు కష్టాల్లో రాజస్థాన్ రాయల్స్...
ఐపీఎల్ 2021: చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో 190 పరుగుల టార్గెట్ను 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన రాజస్థాన్ రాయల్స్, కీలక మ్యాచ్లో చతికిలబడుతోంది... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్, 10 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది...
గత మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన యంగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, 9 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసి కౌంటర్నైల్ బౌలింగ్లో అవుట్ కాగా, ఆ తర్వాత 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 24 పరుగులు చేసిన ఇవిన్ లూయిస్ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్లో ఆరేసిన రాబిన్ ఊతప్ప... అత్యధిక జట్లకు ఆడిన టాప్ 10 ప్లేయర్లు వీరే...
41 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. 6 బంతుల్లో 3 పరుగులు చేసిన సంజూ శాంసన్, 8 బంతుల్లో 3 పరుగులు చేసిన శివమ్ దూబేలను జేమ్స్ నీశమ్ పెవిలియన్కి చేర్చాడు...
Also Read: IPL 2021: మమ్మల్ని తొక్కేస్తున్నారు సార్... ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితిపై ట్రెండింగ్...
ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్ కూడా 13 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి కౌంటర్నైల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 50 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రాజస్థాన్ రాయల్స్...
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరుజట్లకీ కీలకం... ఈ మ్యాచ్లో ఓడితే దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే అవుతుంది.