IPL2021 DC vs MI: నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... రిషబ్ పంత్ అవుట్...
57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... ఫామ్లో ఉన్న శిఖర్ ధావన్తో పాటు పృథ్వీషా, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్ అవుట్...
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా, ముంబై ఇండియన్స్ బౌలర్లు మాత్రం అదిరిపోయే ఫైటింగ్ స్పిరిట్ చూపిస్తున్నారు. 130 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, 57 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
7 బంతుల్లో ఓ సిక్సర్తో 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్, పోలార్డ్ విసిరిన ఓ సూపర్ త్రోకి రనౌట్ అయ్యాడు. 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తర్వాత 7 బంతుల్లో ఓ ఫోర్తో 6 పరుగులు చేసిన పృథ్వీషా, కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
అంపైర్ నాటౌట్గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన ముంబై ఇండియన్స్కి అనుకూలంగా ఫలితం వచ్చింది... 8 బంతుల్లో ఓ సిక్సర్తో 9 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ను కౌంటర్నైల్ బౌల్డ్ చేయగా 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 26 పరుగులు చేసిన రిషబ్ పంత్, జయంత్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్కి అర్హత సాధించగా... 11 మ్యాచుల్లో ఐదు విజయాలు మాత్రమే అందుకున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే...