Asianet News TeluguAsianet News Telugu

IPL2021 CSK vs PBKS: 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే... పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి...

42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్... రెండేసి వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్...

IPL2021 CSK vs PBKS: Chennai Super Kings lost four early wickets against Punjab Kings
Author
India, First Published Oct 7, 2021, 4:23 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్వల్ప స్కోరుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి అర్ష్‌దీప్ సంగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా... మొయిన్ ఆలీ ఆరు బంతులాడి డకౌట్ అయ్యాడు...

ఇది కూడా చదవండి: వచ్చే సీజన్‌లో ఆడతా, అయితే సీఎస్‌కేకి ఆడతానో లేదో... మరో ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ...

ఫస్టాఫ్‌లో బ్యాటుతో అదరగొట్టిన మొయిన్ ఆలీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప 6 బంతుల్లో 2 పరుగులు, అంబటి రాయుడు 5 బంతుల్లో 4 పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు...

Must Read: ఎమ్మెస్ ధోనీ వారసుడొచ్చాడ్రోయ్... దేవ్‌దత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌పై బీభత్సమైన ట్రోలింగ్...

9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది సీఎస్‌కే.. ఫాఫ్ డుప్లిసిస్ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిస్తే, రాజస్థాన్, కోల్‌కత్తా, ముంబై ఇండియన్స్ టీమ్ పర్ఫామెన్స్ ఆధారంగా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది...

Follow Us:
Download App:
  • android
  • ios