ఐపీఎల్ 2025 ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్నిజట్లు టైటిల్ నుండి తప్పుకోగా రెండు జట్లు ఫైనల్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారో చూడాలి.
India Premier League 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించే జట్లేవి… ప్లేఆఫ్ ఆడే జట్లేవో దాదాపు తేలిపోయింది. కేవలం నాలుగో స్థానం కోసం రెండుమూడు జట్లు తలపడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ కు చేరుకున్నాయి. ఇక ముంబై ఇండియన్స్, డిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ లో ఎవరు ప్లేఆఫ్ కు అర్హత సాధిస్తారన్నది తేలాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో ఉండటమే కాదు మంచి నెట్ రన్ రేట్ ను కలిగివుంది ముంబై ఇండియన్స్. దీంతో మిగతా రెండు మ్యాచులు గెలిచి ఈ జట్టే ప్లేఆఫ్ కు చేరుకుంటుందని విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే ఫైనల్ పోరు కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీంల మధ్యనే ఉండే అవకాశాలున్నాయని… ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ట్రోపీని ముద్దాడనున్నారని క్రికెట్ నిపుణుల అంచనా.
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2025 ఐపీఎల్ రేసునుండి తప్పుకున్నాయి. గతేడాది రన్నరప్ గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ లో లీగ్ దశనుండే వినుదిరిగారు. లీగ్ దశ ముగిసాక కేవలం నాలుగు జట్లే ప్లేఆఫ్ కు చేరుకుంటాయి… మిగతా జట్లు ఇంటిదారి పడతాయి. ఈ నాలిగింట్లో రెండుజట్లే ఫైనల్ కు చేరేది… ఇందులో ఒకటి విజేతగా, రెండోది రన్నరప్ గా నిలుస్తాయి.
ఈసారి కొత్త ఛాంపియన్ను చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే ఇంతకు ముందు టోర్నీ గెలవని జట్టు ఈసారి కప్పు అందుకోవాలని కోరుకుంటున్నారు. ఈపాటికే క్రికెట్ ప్రియులు ఏ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నారో అర్థమై ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారైనా ఐపిఎల్ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా ఐపిఎల్ ట్రోపీ గెలవలేవు. ఇక ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, 2022 ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్ కూడా బలమైన జట్లు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో 150 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ఈ టోర్నీలోనూ వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచింది.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి భారతీయ స్టార్లు ముంబై జట్టుకు బలం చేకూరుస్తున్నారు. వీళ్ళ ఆటతీరు ఆరో ఐపీఎల్ కప్పు అందించవచ్చు.రోహిత్ శర్మ ఇటీవలి మ్యాచ్లలో మంచి ఫామ్లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ముంబై బ్యాటింగ్ వెన్నెముక. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రూసో ముంబైకి మంచి ఓపెనర్. విల్ జాక్స్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా రాణిస్తున్నారు. దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మ, విల్ జాక్స్ కూడా బాగా ఆడుతున్నారు.
ఆర్సీబీ కూడా అన్ని విభాగాల్లో బాగా ఆడుతోంది. 48వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ, జోష్ హాజిల్వుడ్ బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తున్నారు.ఆర్సీబీ ఈసారి తమ తొలి ఐపీఎల్ కప్పు గెలవాలని చూస్తోంది.
శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ కూడా బలంగా ఉంది. గత మ్యాచ్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దాడిని ఎదుర్కోలేకపోయింది. గుజరాత్ తమ బలహీనతలను గుర్తించి వ్యూహరచన చేసుకోవాలి.
పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. శ్రేయాస్ అయ్యర్, ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ బలంగా ఉంది. అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ 10 మ్యాచ్ల్లో 5 గెలిచి, 5 ఓడి ఆరో స్థానంలో ఉంది. కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ఫామ్ జట్టుకు ప్రతికూలంగా మారింది. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ బ్యాటింగ్ బాధ్యతలు మోస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ రాథోడ్ తప్ప ఎల్ఎస్జీలో చెప్పుకోదగ్గ బౌలర్ లేడు.
మొత్తంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఒకటి కప్పు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.