India vs Australia 4th Test: 79 పరుగులు చేసి అవుటైన అక్షర్ పటేల్... ప్రతీ వికెట్కి 50+ భాగస్వామ్యాలు నమోదు చేసి రికార్డు క్రియేట్ చేసిన టీమిండియా...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు సాధించింది. 172.3 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 554 పరుగులు చేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 480 పరుగులకి ఆలౌట్ కాగా, టీమిండియా ఇప్పటికే 75 పరుగుల ఆధిక్యంలో ఉంది... 113 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసిన అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు...
శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అనుమానంగా మారింది. దీంతో అయ్యర్ లేకుండానే బ్యాటింగ్ ఆర్డర్ని ప్రమోట్ చేసి కొనసాగించింది టీమిండియా.
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా తొలి వికెట్ నుంచి ఆరో వికెట్ వరకూ ప్రతీ వికెట్కి 50+ భాగస్వామ్యాలు నెలకొల్పారు భారత బ్యాటర్లు. శుబ్మన్ గిల్, రోహిత్ శర్మతో తొలి వికెట్కి 74 పరుగులు, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్కి 113 పరుగులు, విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్కి 58 పరుగుల భాగస్వామ్యం జోడించి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో కలిసి నాలుగో వికెట్కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఆ తర్వాత శ్రీకర్ భరత్తో కలిసి ఐదో వికెట్కి 83 పరుగుల భాగస్వామ్యం, అక్షర్ పటేల్తో కలిసి ఆరో వికెట్కి 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 120-150 పరుగుల ఆధిక్యం సాధిస్తే, ఆఖరి రోజు ఆస్ట్రేలియాపై ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పటికీ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండడంతో 200+ ఆధిక్యం సాధించడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. లండన్ టెస్టులో మాదిరిగా ఐదో రోజు తొలి ఇన్నింగ్స్లో కూడా టీమిండియా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే, మ్యాచ్లో విజయం సాధించడం అవకాశాలు ఉంటాయి...
241 బంతుల్లో 5 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, సెంచరీ తర్వాత దూకుడు పెంచాడు. సెంచరీ పూర్తి చేసుకునేందుకు 5 ఫోర్లు మాత్రమే బాదిన విరాట్ కోహ్లీ, సెంచరీ తర్వాత 10 ఫోర్లు రాబట్టాడు. టెస్టు కెరీర్లో 11వ సారి 150+ మార్కు దాటిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసుకున్నాడు...
కామెరూన్ గ్రీన్ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 21 పరుగులు రాబట్టిన శ్రీకర్ భరత్, 88 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి, కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేసి... నాథన్ లియాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు... ఇండియాలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు నాథన్ లియాన్. ఇండియాలో 55 వికెట్లు తీసిన నాథన్ లియాన్, 54 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ మాజీ బౌలర్ డెరిక్ అండర్వుడ్ రికార్డును అధిగమించేశాడు. నాథన్ లియాన్ బౌలింగ్లో శ్రీకర్ భరత్ అవుట్ కావడం 5 ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగోసారి...