IND vs AUS: చివరి మ్యాచ్ లోనూ టీమిండియా అధిపత్యం .. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాపై ఘన విజయం
IND vs AUS 5th T20: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఐదో టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో గెలిచింది.
![India vs Australia 5th T20I India beat Australia by 6 runs in Bengaluru to win series 4-1 KRJ India vs Australia 5th T20I India beat Australia by 6 runs in Bengaluru to win series 4-1 KRJ](https://static-ai.asianetnews.com/images/01hgr218ny6xnj69k6mzm4f1fy/gaikwad-223-runs--1-_363x203xt.jpg)
IND vs AUS 5th T20I: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను గెలుపుతో ఘనంగా ముగించింది టీమిండియా. ఈ సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఆదివారం (డిసెంబర్ 3) జరిగిన సిరీస్లోని చివరి మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
చివరి ఓవర్లో గెలుపు కోసం ఆసీస్ 10 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత పేసర్ అర్షదీప్ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. దీంతో భారత్ గెలిచింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసింది. ఈ పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది.
చివరిలో ఓవర్ లో ఉత్కంఠ
చివరి ఓవర్లో అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కంగరూ జట్టు విజయం సాధించాలంటే.. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిండే. ఈ 20వ ఓవర్లో ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ను అవుట్ చేయడం ద్వారా అర్ష్దీప్ భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. తొలి, రెండో బంతుల్లో వేడ్ను పరుగులు చేయకుండా నిలువరించాడు. మూడో బంతికి వేడ్ భారీ షాక్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక నాలుగో బంతికి జాసన్ బెహ్రెన్డార్ఫ్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా గెలుపొందాలంటే.. చివరి రెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సి వచ్చింది. నాథన్ ఎల్లిస్ ఐదో బంతికి ఒక పరుగు మాత్రమే తీశాడు.ఆ తర్వాత బెహ్రెన్డార్ఫ్ స్ట్రైక్ లోకి వచ్చాడు. చివరి బంతికి ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముఖేష్ విధ్వంసం
ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 160 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెన్ మెక్డెర్మాట్ గరిష్టంగా 54 పరుగులు చేసినా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. ట్రావిస్ హెడ్ 28, మాథ్యూ వేడ్ 22 పరుగులు చేశారు. ఈ ముగ్గురు మినహా మరే ఇతర బ్యాట్స్మెన్ 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. 17 పరుగుల వద్ద టిమ్ డేవిడ్ ఔట్ కాగా, 16 పరుగుల వద్ద మాథ్యూ షార్ట్ ఔటయ్యాడు. ఆరోన్ హార్డీ ఆరు పరుగులు మాత్రమే చేయగా.. జోష్ ఫిలిప్ నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత్ బౌలర్ ముఖేష్ కుమార్ విధ్వంసం స్రుష్టించాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించారు. ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి.. స్కోర్ బోర్డును కట్టడి చేశారు. ఇక అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.
అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్
అంతకుముందు.. శ్రేయాస్ అయ్యర్ తన T20 కెరీర్లో ఎనిమిదో అర్ధ సెంచరీని సాధించి ఆస్ట్రేలియాపై భారత్ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. జట్టు తరఫున అయ్యర్ అత్యధికంగా 53 పరుగులు చేశాడు. 37 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అక్షర్ పటేల్ 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు. జితేష్ శర్మ 16 బంతుల్లో 24 పరుగులు, యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 21 పరుగులు చేశారు. రితురాజ్ గైక్వాడ్ 10 పరుగులు, రింకూ సింగ్ ఆరు పరుగులు, సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు, రవి బిష్ణోయ్ రెండు పరుగులు చేసి ఔట్ అయ్యారు. అర్ష్దీప్ రెండు పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రెన్ డార్ఫ్, బెన్ డోర్సిస్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా ఒక్కో విజయం సాధించారు.