విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి 98 బంతుల్లో 84 పరుగులు చేసి, ఆస్ట్రేలియాపై భారత్ గెలవడానికి కారణమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ను ఫైనల్కు చేర్చాడు.
Champions trophy semi final లో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై దుమ్మురేపాడు. మార్చి 4న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు.
విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి 98 బంతుల్లో 84 పరుగులు చేసి, ఆస్ట్రేలియాపై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలవడానికి కారణమయ్యాడు. దీనితో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు చేరారు. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 48.1 ఓవర్లలో ఛేదించింది. కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా 45, 27, 42, 28 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
చేజింగ్లో కోహ్లీ ముందుండి నడిపించాడు. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ సపోర్ట్తో ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఈ 84 పరుగుల ఇన్నింగ్స్లో, 36 ఏళ్ల కోహ్లీ ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో 53 ఇన్నింగ్స్లలో 24 సార్లు 50+ స్కోర్లు చేశాడు. ఇందులో వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 58 ఇన్నింగ్స్లలో 23 సార్లు 50+ స్కోర్లు చేశాడు. ఈ రికార్డుతో విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో టాప్ బ్యాటర్గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్లలో 17 సార్లు 50+ స్కోర్లు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు.
మొత్తంగా 24 సార్లు 50+ స్కోర్లు చేశాడు. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో భారీ రికార్డుతో కోహ్లీ గ్లోబల్ ఈవెంట్లలో బెస్ట్ ప్లేయర్గా నిరూపించుకున్నాడు.
అంతేకాదు, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చరిత్రలో భారత్ తరఫున టాప్ రన్-గెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు. ధావన్ 10 మ్యాచ్లలో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 701 పరుగులు చేశాడు. కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేసి, 17 మ్యాచ్లలో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో 746 పరుగులకు చేరాడు. క్రిస్ గేల్ 791 పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా 45 పరుగులు చేయాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. నాలుగు మ్యాచ్లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 217 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ తన ఆట గురించి ఏం చెప్పాడంటే..
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో తన ఆటతీరు గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ లాగే ఉందని, పరిస్థితులను అర్థం చేసుకుని ఆడానని చెప్పాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాక కోహ్లీ మాట్లాడుతూ.. “పాకిస్థాన్తో ఆడిన మ్యాచ్ లాగే అనిపించింది” అని అన్నాడు. “నేను సెంచరీ చేసినప్పుడు ఏడు ఫోర్లు కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడం, నా ఆటను దానికి తగ్గట్టుగా మార్చుకోవడం, స్ట్రైక్ రొటేట్ చేయడం ముఖ్యం. భాగస్వామ్యాలు చాలా ముఖ్యం. ఆ రోజు, ఈ రోజు నేను భాగస్వామ్యాలు నెలకొల్పడానికి ప్రయత్నించాను” అని చెప్పాడు