అవసరమైతే టీమిండియా స్పిన్ కన్సెల్టెంట్ కోచ్‌గా వస్తానని రాహుల్ ద్రావిడ్‌కి చెప్పానంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ట్వీట్... సీనియర్‌‌తో పనిచేయలేనని ద్రావిడ్ రిప్లై! 

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 2-1 తేడాతో ఓడింది టీమిండియా. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి వన్డే నెగ్గిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. 4 ఏళ్ల తర్వాత స్వదేశంలో వచ్చిన వన్డే సిరీస్ ఓటమి ఇది... ఈ సిరీస్ ఓటమితో వన్డేల్లో నెం.1 ర్యాంకు కూడా చేజార్చుకుంది టీమిండియా...

203 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా, 269 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ మినహాయిస్తే మిగిలిన బ్యాటర్లు అందరూ డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. 8వ స్థానంలో వచ్చిన సీన్ అబ్బాట్ 26, 9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అస్టన్ అగర్ 17 పరుగులు చేయగా ఆఖరి బ్యాటర్లు మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా పదేసి పరుగులు చేశారు...

Scroll to load tweet…

కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 56 పరుగులు చేయగా 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు తీస్తే అస్టన్ అగర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల డెత్ ఓవర్లలో పరుగులు రాబట్టడంలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు..

‘కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేసినప్పుడు సరైన ఫీల్డింగ్‌ని సెట్ చేయలేదని నాకు అనిపించింది. ఆడమ్ జంపా బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టీవ్ స్మిత్, అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. అస్టన్ అగర్ కోసం కూడా అద్భుతమైన ఫీల్డ్ సెట్ చేశాడు. 3 ఫీల్డర్లను ఆన్ సైడ్ పెట్టాడు.. మీరేమంటారు..’ అంటూ ఓ నెటిజన్, టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ని ట్యాగ్ చేశాడు...

ఈ ట్వీట్‌కి సమాధానం ఇచ్చిన లక్ష్మణ్ శివరామకృష్ణన్.. ‘నేను కావాలంటే నేను స్పిన్ కోచ్‌గా ఉంటానని రాహుల్ ద్రావిడ్‌కి చెప్పాను. స్పిన్నర్లకు అవసరమైన సలహాలు, గైడింగ్ ఇస్తానని అన్నాను.. అయితే అతను దానికి ఒప్పుకోలేదు. మీరు నాకంటే సీనియర్ అని అన్నాడు. ఇప్పుడు ఏమైంది... ’ అంటూ ట్వీట్ చేశాడు...

టీమిండియా తరుపున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడిన లక్ష్మణ్ శివరామకృష్ణన్, 154 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుటులేని భారత స్పిన్ కోచ్‌గా నియమించాడు రాహుల్ ద్రావిడ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి సాయిరాజ్, స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు.. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత స్పిన్నర్లు అదరగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ 25 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా 22 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్‌కి 3 వికెట్లు దక్కాయి.