మాజీ రంజీ క్రికెటర్ కన్నుమూత..!
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కర్ణాటక మాజీ క్రికెటర్ బి.విజయకృష్ణ (71) నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఉదయం మృతిచెందారు.
పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ రంజీ క్రికెటర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కర్ణాటక మాజీ క్రికెటర్ బి.విజయకృష్ణ (71) నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఉదయం మృతిచెందారు.
1949 అక్టోబరు 12 న జన్మించిన విజయకృష్ణ 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎడమచేతి స్పిన్నర్గా, బ్యాట్స్మెన్గా 80 మ్యాచ్లు ఆడారు. 2,000 పరుగులు చేసి 194 వికెట్లు తీశారు. కర్ణాటక రెండుసార్లు రంజీట్రోఫీ గెలవడంలో విజయకృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన మృతికి సీఎం యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు.