Asianet News TeluguAsianet News Telugu

IPL 2021: చెన్నై గెలిచినా.. రైనా ని మిస్ అయిన అభిమానులు..!

ముఖ్యంగా మ్యాచ్ చివర్లో ధోనీ ఇచ్చిన ఫినిషింగ్ టచ్.. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే.. ఓ విషయం మాత్రం చెన్నై అభిమానులను తీవ్రంగా కలచివేసింది.
 

Fans Miss Suresh Raina As CSK Leave Star Batter Out From Playing XI
Author
Hyderabad, First Published Oct 11, 2021, 10:28 AM IST

ఐపీఎల్-14 సీజన్‌ భాగంగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన ధోనీ సేన ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

చెన్నై విజయం సాధించడం పట్ల ధోనీ అభిమానులంతా ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్ చివర్లో ధోనీ ఇచ్చిన ఫినిషింగ్ టచ్.. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే.. ఓ విషయం మాత్రం చెన్నై అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

 

చెన్నై సూపర్ కింగ్స్‌లో సురేష్ రైనా లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. టాస్ జరిగిన కొన్ని సెకన్లలోనే ‘No Raina’ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా వి మిస్ రైనా అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ వర్షం కురిపించడం గమనార్హం.

ఐపీఎల్ ప్లేఆప్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సురేష్ రైనా టాప్‌లో ఉన్నాడు. ప్లేఆఫ్స్‌లో రైనా 714 పరుగులు చేయగా, ఎమ్మెస్ ధోనీ 504 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాంటి రైనాని ముఖ్యమైన మ్యాచ్ కి దూరం పెట్టడం అభిమానులకు రుచించడం లేదు. చెన్నై ఫాంఛైజీపై విమర్శలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios