Mumbai Indians vs Gujarat Titans: చాలా కాలం త‌ర్వాత ముంబై కెప్టెన్ గా కాకుండా రోహిత్ శ‌ర్మ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ తో కొత్త ప్ర‌యాణం ప్ర‌రంభించిన రోహిత్ శ‌ర్మ‌కు సంబంధించిన దృశ్యాలు షోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

Rohit Sharma - Hardik Pandya : భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ 2013 తర్వాత మొదటిసారిగా ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా లేకుండా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో ఆడుతున్నాడు. హిట్ మ్యాన్ 2013 నుండి 2023 వరకు ముంబై టీమ్ ను న‌డిపించాడు. కెప్ట‌న్ గా అనేక రికార్డులు సృష్టించాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అయితే, ఇటీవలి సీజన్లలో ముంబై ఇండియన్స్ రాణించలేకపోయింది. 2021, 2022లో ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విఫలమయ్యే ముందు 2020లో చివరిసారిగా టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ క్ర‌మంలోనే 2023 సీజన్ తర్వాత, ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్‌ను మార్చాలని నిర్ణయించుకుంది. దీంతో రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించింది. అతని స్థానంలో గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా కొన‌సాగిన హార్దిక్ పాండ్యాను టీమ్ ప‌గ్గాలు అప్ప‌గించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా ఆడేందుకు రోహిత్ శర్మకు కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో హార్దిక్ పాండ్యా మైదానంలో అతనికి ఆదేశాలు ఇచ్చినప్పుడు భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న వెటరన్ బ్యాట్స్‌మన్ రోహిత్ శ‌ర్మ‌ పూర్తిగా అపనమ్మకంతో చూశాడు. గుజ‌రాత్ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను లాంగ్-ఆన్‌కి వెళ్లమని కోరడం కనిపించింది. బౌండరీ వైపు పరుగెత్తే ముందు అతను దానిని రెండుసార్లు అలా హార్దిక్ వైపు చేశాడు. అతను బౌండరీకి ​​సమీపంలో ఫీల్డింగ్ చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ ఇచ్చిన రియాక్ష‌న్ దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.

Scroll to load tweet…

RR VS LSG HIGHLIGHTS: నికోల‌స్ పూరాన్ పోరాటం ఫలించలేదు.. సంజూ అద‌ర‌గొట్టాడు

Scroll to load tweet…

ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేయమని కోరిన తర్వాత టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 39 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోర్ నిలిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా తన నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్యచేధనలో ముంబై ఇండియన్స్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్రెవిస్ 46, రోహిత్ శర్మ 43 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లు అద్భతమైన బౌలింగ్ తో ముంబై గెలిచే మ్యాచ్ ను తమవైపుకు తిప్పుకున్నారు.