CSKvsKXIP: హ్యాట్రిక్తో ముగించిన చెన్నై... ప్లేఆఫ్ రేసు నుంచి పంజాబ్ అవుట్...
ఆల్రౌండ్ విభాగాల్లో ఫెయిల్ అయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్...
48 పరుగులు చేసిన డుప్లిసిస్...
IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, వెళుతూ వెళుతూ వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను కూడా వెంటతీసుకెళ్లాడు. ప్లేఆఫ్ రేసులో గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఐపీఎల్ 2020 సీజన్ను ఓటమితో ముగించింది.
వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచిన పంజాబ్, కీలక మ్యాచుల్లో ఓడి మూల్యం చెల్లించుకుంది. 154 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్... ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఆడుతూ పాడుతూ టార్గెట్ను చేధించింది.
యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదుచేయగా డుప్లిసిస్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 49 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 62 పరుగులు చేయగా అంబటి రాయుడు 29 బంతుల్లో 29 పరుగులు చేశాడు. 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆఖరి మూడు మ్యాచుల్లో విజయాలు హ్యాట్రిక్ విక్టరీలతో సీజన్ 2020ని ముగించింది.