ముంబైలో విషాదం: క్రికెటర్ దారుణహత్య
ముంబైలో దారుణం జరిగింది. క్రికెటర్ను కత్తులతో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళితే... భాండప్ ప్రాంతానికి చెందిన రాకేశ్ పన్వర్ స్థానిక క్రికెటర్.. గురువారం రాత్రి తన గాళ్ ఫ్రెండ్తో కలిసి వస్తుండగా ముగ్గురు దుండగులు రాకేశ్ను కత్తులతో దాడి చేసి చంపేశారు.
ముంబైలో దారుణం జరిగింది. క్రికెటర్ను కత్తులతో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళితే... భాండప్ ప్రాంతానికి చెందిన రాకేశ్ పన్వర్ స్థానిక క్రికెటర్.. గురువారం రాత్రి తన గాళ్ ఫ్రెండ్తో కలిసి వస్తుండగా ముగ్గురు దుండగులు రాకేశ్ను కత్తులతో దాడి చేసి చంపేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాకేశ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా తన చిన్ననాటి స్నేహితుడైన రాకేశ్ పన్వర్ను ఖాన్ కుటుంబసభ్యులు పాత కక్షలతోనే చంపారని మృతుడి స్నేహితుడు గోవింద్ చెప్పారు.
మరోవైపు హత్య సమయంలో రాకేశ్ ప్రియురాలు ఘటనాస్థలంలోనే ఉండటంతో ఆమె సాయంతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.