Asianet News TeluguAsianet News Telugu

IND vs AUS: తొలి టీ20లో టాస్ గెలిచిన ఆసీస్.. బుమ్రా, పంత్ లేకుండానే ఆడుతున్న భారత్

IND vs AUS T20I: పొట్టి ప్రపంచకప్ కు ముందు ఇండియా-ఆస్ట్రేలియాలు తమ బలాబలాలను మరోసారి పరీక్షించుకోనున్నాయి. ఈ మేరకు తొలి మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

Australia won The Toss and Elected To Bowl First Against India
Author
First Published Sep 20, 2022, 6:45 PM IST

వచ్చే నెలలో  ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే  టీ20 ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా భారత్-ఆసీస్ జట్లు పొట్టి సమరానికి సిద్ధమయ్యాయి. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ కు వచ్చిన ఆస్ట్రేలియా...  మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ కు రానుంది.  టీ20 ప్రపంచకప్ కు ఎంపికై ఈ సిరీస్ ద్వారా ఫిట్నెస్ పరిక్షించుకోవాలని చూస్తున్న  బుమ్రాతో పాటు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. 

ఈ సిరీస్ కు ముందు గాయాలతో  ముగ్గురు కీలక ఆటగాళ్లతో పాటు డేవిడ్ వార్నర్ సేవలను కూడా కోల్పోయిన ఆసీస్..  కొత్త ప్లేయర్లను పరీక్షించడానికి ఇండియా పర్యటనను ఓ అవకాశంగా భావిస్తున్నది. ఈ మ్యాచ్ లో సింగపూర్ చిన్నోడు  టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 

 

తుది జట్లు : 

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా,  దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ 

ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కెమరూన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హెజిల్వుడ్ 


 

Follow Us:
Download App:
  • android
  • ios