India Pakistan War: అంబటి రాయుడి ట్వీట్పై మండిపడుతోన్న నెటిజన్లు.. ఇంతకీ ఏం చేశాడంటే.

Synopsis
భారత్పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తలు గంటగంటకు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ చర్యలను భారతీయులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అదే విధంగా భారత ఆర్మీ చర్యకు కూడా అందరూ మద్ధతిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై అంబటి రాయుడు స్పందన: “శాంతే నిజమైన దేశభక్తి” భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు శాంతిని కోరుతూ సోషల్ మీడియాలో స్పందించారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా సహా పలువురు భారత క్రీడాకారులు సైన్యం చేస్తున్న ప్రతిచర్యలకు మద్దతు తెలుపుతుండగా, రాయుడు మాత్రం శాంతిని సమర్థిస్తూ స్పందించారు.
గురువారం సాయంత్రం పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణులు, ఆర్టిల్లరీ దాడులతో పౌర ప్రాంతాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ధర్మశాలలో జరుగుతున్న IPL 2025 మ్యాచ్ను మధ్యలోనే ఆపివేశారు. ఆటగాళ్లను, ప్రేక్షకులను సురక్షితంగా ఖాళీ చేశారు.
ఇదే సమయంలో అంబటి రాయుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా కన్నుకు కన్ను సిద్ధంతో ప్రపంచం అంధకారమవుతుందని పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఓ రేంజ్లో విరుచుకపడ్డారు. కయ్యానికి కాలు దువ్వుతోన్న పాకిస్థాన్కు ఇదే సరైన సమాధానం అని, భారత్ ఇన్ని రోజులు శాంతి పాటిస్తే ఏం జరిగింది అంటూ పలువురు కామెంట్స్ చేశారు. అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో రాయుడు తదుపరి పోస్టులో స్పష్టత ఇచ్చారు.
“ఇది బలహీనతకు సంకేతం కాదు, వివేకానికి గుర్తు. న్యాయం తప్పకుండా జరగాలి కానీ మానవత్వాన్ని మర్చిపోవద్దు. దేశాన్ని ప్రేమించడంలో తప్పులేదు, కానీ మన హృదయంలో దయ కూడా ఉండాలి. దేశభక్తి, శాంతి రెండూ కలిసి నడవవచ్చు,” అనిర రాసుకొచ్చారు. రాయుడు మరో పోస్ట్లో జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి, భద్రత కోసం ప్రార్థించారు. “జమ్మూ కశ్మీర్, పంజాబ్, సరిహద్దులోని ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి భద్రత కోసం ప్రార్థిస్తున్నా. ఈ పరిస్థితికి త్వరలో పరిష్కారం లభించాలని ఆశిస్తున్నా. జై హింద్!” అని పేర్కొన్నారు.