ఆయేషా ముఖర్జీతో విడాకులు.. శిఖర్ ధావన్ స్పందన ఇది
ఆయేషా ముఖర్జీతో విడాకుల వంటి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న తుఫాను గురించి శిఖర్ ధావన్ పెద్దగా ఆందోళన చెందడం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి బుధవారం తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘ మీ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయండి ’’ అని పోస్ట్ చేశాడు.
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ.. సోషల్ మీడియా ద్వారా తమ ఎనిమిదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల చివరిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడనున్న ధావన్.. తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న తుఫాను గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి బుధవారం తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘ మీ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయండి ’’ అని పోస్ట్ చేశాడు.
జూలైలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో శిఖర్ ధావన్ భారతజట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ధావన్ నాయకత్వంలో జట్టును వన్డే సిరీస్ను గెలుచుకున్నప్పటికీ.. టీ20 సిరీస్ను మాత్రం కోల్పోయింది. కాగా, జీవితంలో రెండోసారి విడాకులు తీసుకోబోతున్నందుకు బాధగా వుందంటూ శిఖర్ ధావన్ భార్య ఆయేషా ఉద్వేగంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మెల్బోర్న్కు చెందిన ఆయేషాకు ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్తతో గతంలో వివాహం జరిగింది. అతనితో ఆమెకు ఇద్దరు కుమార్తెలు కలిగారు. అనంతరం విడాకులు తీసుకున్న ఆయేషా.. 2009లో ధావన్తో నిశ్చితార్థం చేసుకుని, 2012లో అతనిని వివాహం చేసుకున్నారు. శిఖర్ ధావన్తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు(జొరావర్) పుట్టాడు. ఆయేషా ఒక కిక్ బాక్సింగ్ క్రీడాకారిణీ.
అయేషా విడాకుల విషయంపై ఇన్స్టాలో సుదీర్ఘమైన పోస్టు చేశారు. వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తివంతమైన అర్థాలు కలిగి ఉంటాయని అన్నారు. మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డానని, జీవితంలో విఫలమైనట్లు, తప్పుచేస్తున్నట్లుగా భావించాననని అన్నారు. తన తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురిచేసినట్లు భావించానని ఆమె తెలిపారు. ఇక రెండోసారి విడాకులు తీసుకోవడం అనేది ఊహించుకుంటే భయంకరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సమయంలో తనను తాను మళ్లీ నిరూపించుకోవాలని అయేషా తెలిపింది.