Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ లో రోహిత్ కు ద‌క్క‌ని చోటు.. ! కెప్టెన్ ఎవ‌రంటే..?

IPL all-time greatest team: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ విజ‌య‌వంతంగా 16వ సీజ‌న్ ను పూర్తి చేసుకుంది. 17వ సీజ‌న్ ఐపీఎల్ 2024 మార్చి చివ‌రి వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే  ఐపీఎల్ ఆల్ టైమ్ టీమ్ స్క్వాడ్‌ను ప్ర‌క‌టించగా, ఈ టీమ్ లో 8 మంది భారతీయులు ఉండగా, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. 
 

8 Indians in IPL All Time Greatest Team, MS Dhoni as Captain; No place for Rohit Sharma RMA
Author
First Published Feb 21, 2024, 4:08 PM IST

IPL all-time greatest team: 2008లో ప్రారంభమైన పాపులర్ టీ20 క్రికెట్ లీగ్ 'ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)' 16 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. 17వ ఎడిష‌న్ కు సిద్ధ‌మ‌వుతోంది. 17వ సీజ‌న్ ఐపీఎల్ 2024 ప్రారంభం.. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ఐపీఎల్ విజ‌య‌యాత్ర‌ను పురస్కరించుకుని ఎంపిక చేసిన ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జట్టుకు భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా  ఎంపిక చేశారు. టీమ్ సెలక్షన్ కమిటీలో మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్ ల‌తో పాటు ఎంపిక ప్రక్రియలో 70 మందికి పైగా స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్టులు కూడా పాల్గొన్నారు.

ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జట్టులో ఓపెనర్లుగా ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, భారత బ్యాటింగ్ ప్రధాన కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేయగా, బ్యాటింగ్ ఆర్డర్లో క్రిస్ గేల్ కు మూడో స్థానం దక్కింది. 15 మంది సభ్యుల జట్టులో సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ధోనీలు ఉండగా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్ ముగ్గురు ఆల్ రౌండర్లుగా ఉన్నారు. రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చాహల్ స్పిన్ అటాక్ చేయగా, ఫాస్ట్ బౌలర్లలో లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలు పేస్ బౌలింగ్ కేట‌గిరిలో ఉన్నారు.

విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?

ఫిబ్రవరి 20, 2024తో తొలి ఐపీఎల్ వేలం జరిగి 16 ఏళ్లు పూర్తవుతుంది. 'స్టార్ స్పోర్ట్స్ ఇన్ క్రెడిబుల్ 16 ఆఫ్ ఐపీఎల్' షోలో ప్రత్యేకంగా మాట్లాడిన దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ధోనీ నాయకత్వ ప్రతిభకు ప్రతీక అని కొనియాడారు. 'అది ఎంఎస్ ధోనీ కావాలి. వరల్డ్కప్, ఐపీఎల్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా అన్నింటిని గెలిచాడు' అని స్టెయిన్ చెప్పుకొచ్చాడు. అలాగే, ధోని నాయ‌క‌త్వంలోనే కాకుండా త‌మ ఆటలో అత్యున్నత స్థాయిలో ఉన్నారనీ, మైదానంలో.. వెలుపల వారిని బాగా నిర్వహించగల వ్యక్తి వారికి అవసరమని, కాబట్టి తాము ఎంఎస్ ధోనీకి కెప్టెన్సీ ఇచ్చామ‌ని చెప్పారు.

ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆల్-టైమ్ ఫేవరెట్ కెప్టెన్‌గా నిలిచాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఐదు టైటిళ్లను కూడా అందించాడు. అయితే ముంబై ఇండియన్స్ కు ఐదుసార్లు టైటిల్ అందించినా ఆ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కక‌పోవ‌డం గ‌మనార్హం. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అయినప్పటికీ ఎంఎస్ ధోనితో పోలిస్తే అతని నాయకత్వం బలహీనంగా ఉందని సెల‌క్ష‌న్ క‌మిటీ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జట్టు :

ఎంఎస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చాహల్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా

కొడుకు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ !

Follow Us:
Download App:
  • android
  • ios