ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో492 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 94వేల 536 కి చేరుకొన్నాయి.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో492 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 94వేల 536 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. చిత్తూరు, విశాఖపట్టణం జిల్లాల్లో కరోనాతో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,193 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,48,05335 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 33,634 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో492 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 256 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 84వేల 727మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 2616 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 029, చిత్తూరులో 056,తూర్పుగోదావరిలో 168,గుంటూరులో 047, కడపలో 005,కృష్ణాలో 063, కర్నూల్ లో 020, నెల్లూరులో 022,,ప్రకాశంలో 012, శ్రీకాకుళంలో 010, విశాఖపట్టణంలో 046, విజయనగరంలో 002,పశ్చిమగోదావరిలో 012కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -68,041, మరణాలు 601
చిత్తూరు -88,496,మరణాలు 858
తూర్పుగోదావరి -1,25,034, మరణాలు 636
గుంటూరు -76,348, మరణాలు 673
కడప -55,569, మరణాలు 463
కృష్ణా -49,434,మరణాలు 683
కర్నూల్ -61,185, మరణాలు 492
నెల్లూరు -62,649, మరణాలు 509
ప్రకాశం -62,308, మరణాలు 582
శ్రీకాకుళం -46,399,మరణాలు 347
విశాఖపట్టణం -60,530,మరణాలు 569
విజయనగరం -41,227, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,421, మరణాలు 542

Scroll to load tweet…