Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఈ-ట్రాక్టర్‌ వచ్చేసింది...త్వరలో అందుబాటులోకి..

దేశీయ విపణిలోకి విద్యుత్ ఆధారిత ఈ-ట్రాక్టర్‌ వచ్చేసింది. దీని ధర రూ.5 లక్షలు ఉంటుందని దాన్ని అభివృద్ధి చేసిన సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ అనే స్టార్టప్ సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాదిలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఈ-ట్రాక్టర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. 
 

Cellestial E-Mobility unveils electric-tractor in india
Author
Hyderabad, First Published Mar 12, 2020, 10:29 AM IST

హైదరాబాద్‌: దేశంలోనే తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ (ఈ-ట్రాక్టర్‌)ను హైదరాబాద్‌కు చెందిన సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ స్టార్టప్ అభివృద్ధి చేసింది. వచ్చే 3-4 నెలల్లో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఆరు హెచ్పీల (21 హెచ్పీ డీజిల్ ట్రాక్టర్‌తో సమానం) శక్తి కలిగిన  ట్రాక్టర్‌కు ఇది సమానం. 

ఇది మామూలు ట్రాక్టర్‌ చేసే పనులన్నీ చేస్తుందని సెలిస్టియల్‌ ఈ-మొబిలిటీ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ సిద్ధార్థ దురైరాజన్‌ తెలిపారు. దీని ధర దాదాపు రూ.5 లక్షలు ఉంటుంది.ఒకసారి చార్జీ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 

also read కే‌టి‌ఎం బైక్ కి పోటీగా బజాజ్ కొత్త బైక్

ఈ ట్రాక్టర్ గరిష్ఠ వేగం 20 కిలోమీటర్లు. 4-6 గంటల్లో బ్యాటరీ ఛార్జీ కాగలదని, ఒకసారి ఛార్జీ చేస్తే 4-5 గంటలు పనిచేస్తుందని సిద్దార్థ దురైరాజన్‌ తెలిపారు. బ్యాటరీ సామర్థ్యం 150 ఎంఏహెచ్‌. పుల్లింగ్‌ సామర్థ్యం 1.2 టన్నులు.

నెలకు 100 ట్రాక్టర్ల తయారీ సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ ఉందని, వచ్చే మూడేళ్లలో 8,000 ట్రాక్టర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సిద్దార్థ దురై రాజన్ చెప్పారు. ఏడాది కాలంలో 1,200 ట్రాక్టర్లను విక్రయించగలమని కంపెనీ భావిస్తోంది. 

Cellestial E-Mobility unveils electric-tractor in india

డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన సాధారణ ట్రాక్టర్‌ ఒక గంట పని చేయడానికి దాదాపు రూ.150 ఖర్చు అవుతుంది. సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ ట్రాక్టర్‌ వినియోగదారులకు గంటకు దాదాపు రూ.20-35 ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. 

ఇంజినీరింగ్‌ డిజైన్‌, అడ్వాన్స్‌డ్‌ బ్యాటరీ టెక్నాలజీ, కాస్టింగ్‌, ఫ్యాబ్రికేషన్‌, ట్రాక్టర్‌ తయారీ, మార్కెటింగ్‌లో అనుభవం గల నలుగురు భాగస్వాములు కలిసి ఈ-ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌ వద్ద ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్‌ ప్లాంట్లో ప్రస్తుతం నెలకు 100 ట్రాక్టర్లు తయారవుతున్నాయి. డిమాండ్‌ అధికంగా ఉంటే వచ్చే మూడేళ్ల కాలంలో ఈ కెపాసిటీని 8 వేలకు పెంచుకోనున్నట్లు సిద్దార్థ దురైరాజన్ ప్రకటించారు. ఏడాది క్రితం ఈ-మొబిలిటీ విభాగంలోకి అడుగుపెట్టిందీ సంస్థ.

also read మహాబుబ్‌నగర్‌లో ఇటాలియన్ బైక్స్ బెనెల్లి ప్రత్యేకమైన షోరూం...

మరోవైపు ఏడాదిలో డైవర్‌ లేకుండా నడిచే (సెల్ప్‌ డ్రైవింగ్‌ ) ఈ-ట్రాక్టర్‌ను సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ అభివృద్ధి చేయనుంది. జియో ఫెన్సింగ్‌, అల్గారిథమిక్‌ గ్రాఫింగ్‌ను వినియోగించి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఈ-ట్రాక్టర్‌ను అభివృద్ధి చేయనున్నామని సిద్ధార్థ దురైరాజన్ తెలిపారు.

ఇందుకు అవసరమైన అటానమస్‌ టెక్నాలజీ కోసం సింగపూర్‌కు చెందిన విశ్వవిద్యాలయంతో చేతులు కలిపామని సిద్దార్థ దురైరాజన్‌ తెలిపారు. ఈ ట్రాక్టర్‌ ధర రూ.10 లక్షలు ఉండే వీలుంది. ఈ-ట్రాక్టర్‌ ప్లాట్‌ఫారమ్‌పై లైట్‌ కమర్షియల్‌ ట్రక్‌, బస్‌ తదితర వసతులను కంపెనీ అభివృద్ధి చేయనుంది. 

లైట్‌ కమర్షియల్‌ వాహనం ప్రోటోటైప్‌ అభివృద్ధిని ఇప్పటికే సెలెస్టియల్ ఈ-మొబిలిటీ ప్రారంభించింది. ఏంజెల్‌ ఇన్వెస్టర్ల ద్వారా ఆరు నెలల క్రితం రెండు లక్షల డాలర్ల మేరకు అంటే రూ.కోటి నిధులను సమీకరించింది. కంపెనీ వచ్చే 6 నెలల్లో ప్రైవేట్‌ ఈక్విటీ ద్వారా 60 లక్షల డాలర్లు (దాదాపు రూ.50 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios