మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ పాన్ కార్డుతో లింక్ చేసుకోమని ఏదైనా మెసేజ్ వచ్చిందా. లేదా ఫలానా ఆన్లైన్ లింకు ద్వారా పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయండి అంటూ ఏదైనా మెసేజ్ వచ్చిందా అయితే వెంటనే అలాట్ అవ్వండి అది ఫేక్ మెసేజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మీకు SBIలో అకౌంట్ ఉందా అయితే పాన్ నెంబర్ అప్డేట్ చేయలేదా, మీ అకౌంట్ వెంటనే మూసి వేస్తున్నామని మెసేజ్ వచ్చిందా. అయితే అది ఆ మెసేజ్ నకిలీ మెసేజ్ అని SBI ధృవీకరించింది. తమ బ్యాంకు గానీ, ఇతర అధికారులు కానీ తమ అనుబంధ సంస్థలు గానీ ఎలాంటి మెసేజెస్ కస్టమర్లకు పంపడం లేదని పిఐబి ద్వారా SBI తెలిపింది. వివరాల్లోకి వెళితే గతంలో జన్ ధన్ ఖాతాల కింద కోట్లాదిమంది ప్రజలకు ఏదైనా ఒక గుర్తింపు కార్డును ఉపయోగించి బ్యాంకు ఖాతాలను తెరిచారు. అయితే ఈ బ్యాంకు ఖాతాలకు పాన్ కార్డు కూడా జత చేసుకోమని గతంలో ఎస్బిఐ కోరింది కానీ పాన్ కార్డును జతచేయని అకౌంటులను సీజ్ చేస్తామని బ్యాంకు ఎప్పుడు చెప్పలేదని ఎస్బీఐ యాజమాన్యం తెలిపింది.
పాన్ నంబర్ను అప్డేట్ చేయని ఖాతాదారుల అకౌంట్లను బ్లాక్ చేయడం లేదా మూసివేస్తామంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ యోనో యాప్ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశాలు నకిలీవని. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ సందేశాలు పూర్తిగా తప్పు అని ధృవీకరించింది. అంతేకాదు తమ అకౌంటుతో ప్యాన్ కార్డును జతచేయమని వస్తున్న ఆన్ లైన్ లింకులు సైతం నకిలివేనని తెలిపింది.
SBI తన కస్టమర్లకు బ్యాంకింగ్ను సులభంగా , సౌకర్యవంతంగా చేయడానికి వివిధ సౌకర్యాలను అందిస్తుంది. SBI, Yono మొబైల్ బ్యాంకింగ్ యాప్ వినియోగం ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది, ఖాతాదారులు తమ ఇంటి నుండి సౌకర్యవంతమైన అకౌంట్లను తెరవడానికి , వివిధ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఇంతలో, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ నంబర్లు, ఆధార్ నంబర్లు, పాన్ కార్డ్ నంబర్లు, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు , OTPల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దని బ్యాంక్ వినియోగదారులను హెచ్చరించింది.
సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం, ప్రాముఖ్యత గురించి SBI ఇప్పటికే వినియోగదారులను హెచ్చరించింది. మెసేజ్లు లేదా ఇమెయిల్ల ద్వారా పంపిన లింక్లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్లు లేదా మెసేజ్ లకు ప్రతిస్పందనగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని బ్యాంక్ తన కస్టమర్లకు సూచించింది. అప్రమత్తంగా ఉండటం ద్వారా, వినియోగదారులు సైబర్ నేరాల నుండి తమను తాము రక్షించుకోవచ్చని చెబుతున్నారు.
SBI అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఖాతా వివరాలను అప్డేట్ చేయాలని, సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాల గురించి వినియోగదారులు తెలుసుకోవాలి. వారు తమ వ్యక్తిగత సమాచారం , బ్యాంక్ అకౌంట్లను రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. బ్యాంకుకు సంబంధించిన ఏవైనా వార్తలను నిర్ధారించడానికి అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాలని సూచించింది.