సెన్సెక్స్, నిఫ్టీలు మార్కెట్ ప్రారంభంలో లాభాలతో ప్రారంభం అయినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 58000 పాయింట్ల వద్ద ఊగిసలాడుతోంది. నిఫ్టీ 17350 పాయింట్ల దిగువకు జారుకుంది.
ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సూచనల మధ్య నిఫ్టీ 17400 పాయింట్ల పైన పాజిటివ్ నోట్తో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 గంటలకు వద్ద, సెన్సెక్స్ 418.72 పాయింట్లు 0.72 శాతం పెరిగి 58408.02 వద్ద, నిఫ్టీ 123.70 పాయింట్లు లేదా 0.71% పెరిగి 17439.20 వద్ద ప్రారంభం అయ్యాయి. దాదాపు 1475 షేర్లు పురోగమించగా, 396 షేర్లు క్షీణించాయి మరియు 75 షేర్లు మారలేదు. అయితే ప్రారంభ లాభాలు నెమ్మదిగా ఆవిరి అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ఐఓసి, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు టాటా స్టీల్ ప్రధాన లాభాల్లో ఉండగా, భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, సిప్లా మరియు హీరో మోటోకార్ప్ నష్టపోయాయి.
IT డిపార్ట్మెంట్ హీరో మోటోకార్ప్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించింది. Hero MotoCorp ఈ సెర్చ్ ఆపరేషన్స్ ప్రస్తుతం సుమారు 25 కార్యాలయాల్లో కొనసాగుతున్నాయని, దీంతో హీరో మోటోకార్ప్ 1.34 శాతం నష్టపోయింది.
వి కె విజయకుమార్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ మాట్లాడుతూ... మార్కెట్లో ఇప్పుడు రెండు ముఖ్యమైన ట్రెండ్లు ఉన్నాయి. ఒకటి, 17000 నిఫ్టీ ఇప్పుడు మార్కెట్కు బలమైన సాంకేతిక మద్దతుగా మారింది. నిన్నటి 17000 స్థాయిల నుండి షార్ప్ బౌన్స్ ఇప్పుడు బలమైన మద్దతు స్థాయి అని సూచిస్తుంది. రెండోది TCS, Infosys, ITC సెలెక్ట్ ఫైనాన్షియల్స్ వంటి అధిక నాణ్యత గల స్టాక్లలో భారీ డెలివరీ ఆధారిత కొనుగోలు నడుస్తోంది. ఇది మార్కెట్లో రిస్క్-ఆన్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది.
అయితే, ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన ప్రపంచ ఆందోళనలు కూడా ఉన్నాయి. US 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ ఇప్పుడు 2.42% వద్ద ఉంది. పెరుగుతున్న బాండ్ ఈల్డ్లు, హాకిష్ ఫెడ్ US ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టివేస్తుందనే ఆందోళనను పెంచుతోంది. యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, హాకిష్ సెంట్రల్ బ్యాంకుల ప్రతికూల ప్రభావాన్ని మార్కెట్లపై తగ్గించలేదనే వాదనలో తర్కం ఉందని ఆయన పేర్కొన్నారు.
