మరో బ్యాంకు దివాళా తీసింది, డిపాజిటర్లకు సొమ్ములు చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి దాని లైసెన్స్ రద్దు, చేసి, డిపాజిటర్ల భద్రత కోసం చర్యలకు దిగింది. 

మధ్యప్రదేశ్‌లోని గుణాలో ఉన్న గర్హా సహకరి బ్యాంక్ (Garha Co-operative Bank) లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం రద్దు చేసింది. ఈ బ్యాంక్‌కు తగినంత మూలధనం లేదని, డిపాజిటర్లకు తిరిగి చెల్లించే అవకాశం లేదని ఆర్‌బిఐ తెలిపింది. ఈ సహకార బ్యాంకులో 98.4 శాతం మంది డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

లైసెన్స్ రద్దు చేసింది..
లైసెన్స్ రద్దు ఫలితంగా, బ్యాంకు డిపాజిట్ల స్వీకరణ, డిపాజిట్లను తిరిగి చెల్లించడం వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహించకుండా నిషేధించింది. ఆర్‌బిఐ సోమవారం పని వేళలు ముగిసే సమయానికి లైసెన్స్‌ను రద్దు చేసింది, బ్యాంక్ వద్ద తగినంతగా మూలధనం లేదని, సంపాదన సామర్థ్యం లేదని పేర్కొంది. గర్హా సహకరి బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక స్థితితో దాని ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తి చెల్లింపులు చేయలేకపోతుందని పేర్కొంది. 

డిపాజిటర్లకు ఇంత మొత్తం లభిస్తుంది
డిఐసిజిసి నుండి ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ బీమా క్లెయిమ్ మొత్తాన్ని రూ. 5,00,000 వరకు పొందేందుకు అర్హులని ఆర్‌బిఐ తెలిపింది. డిసెంబరు 19, 2022 వరకు, బ్యాంక్‌కి సంబంధించిన సంబంధిత డిపాజిటర్ల నుండి స్వీకరించిన అభ్యర్థన ఆధారంగా మొత్తం బీమా చేసిన డిపాజిట్‌లలో డిఐసిజిసి ఇప్పటికే రూ.12.37 కోట్లను చెల్లించింది.