కోక్, పెప్సికో, బిస్లెరీలకు భారీ జరిమానా.. కారణం ఏమిటో తెలుసుకోండి..
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) కోక్, పెప్సికో, బిస్లెరీలకు భారీ జరిమానాలు విధించింది. ఈ కంపెనీలకు సుమారు 72 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం.
ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయడం, సేకరించడం వంటివి ప్రభుత్వ సంస్థకు నివేదించనందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) కోక్, పెప్సికో, బిస్లెరీలకు భారీ జరిమానాలు విధించింది.
ఈ కంపెనీలకు సుమారు 72 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం. సిపిసిబి బిస్లెరీకి రూ .10.75 కోట్లు, పెప్సికో ఇండియాకు రూ .8.7 కోట్లు, కోకాకోలాకు రూ .50.66 కోట్లు జరిమానా విధించింది.
కోక్, పెప్సీకో, బిస్లరీతో పాటు బాబా రామ్ దేవ్ చెందిన సంస్థ పతంజలికి కూడా జరిమానా కూడా విధించింది. పతంజలికి రూ.1 కోట్ల జరిమానా విధించింది. మరో కంపెనీకి రూ .85.9 లక్షలు జరిమానా విధించారు.
also read బిల్ గేట్స్ నివసిస్తున్న ఇంటి విలువ ఎంతో తెలుసా.. అతని లైఫ్ స్టయిల్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ...
15 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి.
ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్బిలిటీ (ఇపిఆర్) అనేది ఒక విధాన కొలత, దీని ఆధారంగా ప్లాస్టిక్ను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తిని పారవేసినందుకు బాధ్యత వహించాలి. ఈ నేపథ్యంలో అన్ని సంస్థలు 15 రోజుల్లోపు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
21,500 టన్నుల ప్లాస్టిక్కు టన్ను 5,000 రూపాయల చొప్పున బిస్లెరీకి జరిమానా విధించగా, 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలకు పెప్సి బాధ్యత వహించింది. అలాగే 2020 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 4,417.78 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించినట్లు కోక్ సిపిసిబికి పత్రాలను అందించింది.
కోక్ ప్రతినిధి మాట్లాడుతూ: “మేము కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు జారీ చేసిన నోటీసును అందుకున్నాము. ది కోకాకోలా కంపెనీ (టిసిసిసి) గ్లోబల్ ఆపరేషన్లలో భాగంగా, మేము రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్తో, ల్యాండ్ చట్టాల పరిధిలో పూర్తిస్థాయిలో ఆపరేట్ చేస్తాము.
మేము ప్రస్తుతం ఆర్డర్ను అధ్యయనం చేస్తున్నాము అలాగే నిర్ణీత కాలపరిమితిలో సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తాము. ” అని అన్నారు.