ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటన చేసిన తర్వాత గత ఏడాది మే 2022లో భారత ప్రభుత్వం ఇంధన ధరల చివరి సవరణను చేసింది.

ఈరోజు మార్చి 7న పెట్రోలు-డీజిల్ ధరలు  దేశంలోని చాలా ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటన చేసిన తర్వాత గత ఏడాది మే 2022లో భారత ప్రభుత్వం ఇంధన ధరల చివరి సవరణను చేసింది. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి.

దేశ రాజధానిలో ఢిల్లీలో ఇంధన ధరలు లీటరు పెట్రోల్‌కు రూ. 96.72, డీజిల్‌కు ధర రూ. 89.62గా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉండగా, చెన్నైలో లీటర్ పెట్రో ధర రూ.102.63గా, డీజిల్ రూ.94.24గా ఉంది.

నోయిడా
పెట్రోలు- ధర లీటరుకు రూ. 96.79
డీజిల్- ధర లీటరుకు రూ. 89.96

బెంగళూరు
పెట్రోలు- ధర లీటరుకు రూ.101.94
డీజిల్- ధర లీటరుకు రూ.87.89

చెన్నై
పెట్రోలు - ధర  లీటరుకు రూ.102.63
డీజిల్ - ధర లీటరుకు రూ.94.24

కోల్‌కతా
పెట్రోలు - ధర  లీటరుకు రూ.106.03
డీజిల్ - ధర లీటరుకు రూ.92.76

గుర్గావ్
పెట్రోలు - ధర లీటరు రూ.97.18
డీజిల్ - ధర లీటరుకు రూ.90.05

చండీగఢ్
పెట్రోలు - ధర లీటరు రూ.96.20
డీజిల్ - ధర లీటరుకు రూ.84.26

లక్నో
పెట్రోలు - ధర లీటరు రూ.96.62
డీజిల్ - ధర లీటరుకు రూ.89.81

మీ నగరంలో పెట్రోల్-డీజిల్ తాజా ధరలు - తెలుసుకోవాలంటే కస్టమర్లు పెట్రోల్ పంప్  “RSP <space> డీలర్ కోడ్”ని 9224992249కి  మెసేజ్ పంపడం ద్వారా పెట్రోల్,  డీజిల్ తాజా ధరలను చెక్ చేయవచ్చు.  

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతాయి. వాల్యు ఆధారిత పన్ను (VAT), సరకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 

మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి. పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 90 పైసల సెస్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ కూడా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ రెండవ పూర్తి బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్, మద్యంపై సెస్‌ను ప్రకటించారు. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 సామాజిక భద్రత సెస్ విధించబడుతుంది.

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 40 సెంట్లు లేదా 0.5% పెరిగి బ్యారెల్‌కు $86.58కి చేరుకుంది, సోమవారం నాడు 0.4% పెరిగింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కు $80.76 వద్ద ఉంది, గత సెషన్‌లో 1% లాభంతో 30 సెంట్లు లేదా 0.4% పెరిగింది.