Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్ తరువాత వాహనదారులకు రిలీఫ్.. నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇవే..

మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 8న డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 పెంచింది.  

 Petrol and Diesel Rate Today 2 February: Fuel prices steady Check rates in Delhi Mumbai other cities
Author
First Published Feb 2, 2023, 9:32 AM IST

నేడు ఇంధన ధరలు 2 ఫిబ్రవరి 2023 గురువారం రోజున స్థిరంగా కొనసాగాయి, దాదాపు ఎనిమిది నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. పెట్రోల్,  డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
కోల్‌కతా: నేడు పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 106.03, డీజిల్ ధర లీటర్‌కు రూ. 92.76,
బెంగళూరు: పెట్రోలు ధర లీటర్‌కు రూ. 101.94, డీజిల్ ధర రూ.89 లీటరుకు
లక్నో: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
నోయిడా: పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96 
గురుగ్రామ్: పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. లీటరుకు 90.05
చండీగఢ్: పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర  రూ.97.82

మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 8న డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 పెంచింది.  

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి. పెట్రోల్ డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

Follow Us:
Download App:
  • android
  • ios