గత నెల మే 22న కేంద్ర ప్రభుత్వం చమురు ధరపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రజలకు భారీ ఊరటనిచ్చింది. శుక్రవారం ఉదయం, WTI క్రూడ్ ధర బ్యారెల్కు $ 88.80 అండ్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $ 94.35కు పడిపోయింది.

 గత మూడు నాలుగు రోజులుగా క్రూడాయిల్ ధర తగ్గింపు ప్రభావం పెట్రోల్-డీజిల్ ధరపై లేదు. మరోవైపు నాలుగైదు నెలలుగా దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రూడాయిల్, డీజిల్-పెట్రోల్, విమాన ఇంధనం (ATF)పై విధించే కొత్త పన్నును ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

గత నెల మే 22న కేంద్ర ప్రభుత్వం చమురు ధరపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రజలకు భారీ ఊరటనిచ్చింది. శుక్రవారం ఉదయం, WTI క్రూడ్ ధర బ్యారెల్కు $ 88.80 అండ్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $ 94.35కు పడిపోయింది.


అక్టోబర్ 14న పెట్రోలు-డీజిల్ ధరలు
- పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ రూ. 84.10, డీజిల్ ధర రూ. 79.74
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62 
-ముంబైలో పెట్రోల్ ధర రూ. 111.35, డీజిల్ ధర రూ. 97.28
- కోల్‌కతా పెట్రోల్‌ ధర రూ. 106.03, డీజిల్‌ ధర రూ. 92.76
- నోయిడాలో పెట్రోల్‌ ధర రూ. 96.57, డీజిల్‌ ధర రూ. 89.96
- లక్నోలో పెట్రోల్‌ ధర రూ. 96.57, డీజిల్‌ ధర రూ. 89.76
-జైపూర్‌లో పెట్రోల్‌ ధర రూ. 108.48, డీజిల్ ధర లీటరు రూ. 93.72
–తిరువనంతపురంలో పెట్రోల్ రూ. 107.71, డీజిల్ ధర లీటరుకు రూ. 96.52
 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఓ‌ఎం‌సిలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. VAT లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.