జియోగేమ్స్ ప్లాట్ఫామ్పై 'కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏస్ ఇ-స్పోర్ట్స్ ఛాలెంజ్' ను ప్రారంభించిన జియో
మొబైల్ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్తో కలిసి జియో గేమ్స్ ఇ-స్పోర్ట్స్ ప్లాట్ఫామ్పై ఆన్లైన్ షూటింగ్ గేమ్ - 'కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏసెస్ ఇ-స్పోర్ట్స్ ఛాలెంజ్' ను ప్రారంభించినట్లు డిజిటల్ కంపెనీ జియో ప్రకటించింది.
న్యూఢిల్లీ. మొబైల్ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్తో కలిసి జియో గేమ్స్ ఇ-స్పోర్ట్స్ ప్లాట్ఫామ్పై 'కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏసెస్ ఇ-స్పోర్ట్స్ ఛాలెంజ్' అనే ఆన్లైన్ షూటింగ్ గేమ్ను ప్రారంభించినట్లు డిజిటల్ కంపెనీ జియో ప్రకటించింది. కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ను యాక్టివిజన్ పబ్లిషింగ్ ఆఫ్ అమెరికా ప్రచురించింది. ఇది భారతదేశంలో నిషేధించిన పబ్-కి గేమ్ కి ప్రత్యర్థి.
జియో, క్వాల్కామ్ సిడిఎంఎ టెక్నాలజీస్ ఆసియా పసిఫిక్ పిటి (క్యూసిటిఎపి) భారతదేశంలో 'కాల్ ఆఫ్ డ్యూటీ' మొదటి ఇ-కాంటెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది, ఇందులో ప్రైజ్ మని కింద రూ .25 లక్షలు అందించనుంది. ఒక ఉమ్మడి ప్రకటన ప్రకారం, "కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏసెస్ ఇస్పోర్ట్స్ ఛాలెంజ్" జియో ఇంకా నాన్-జియో వినియోగదారులకు ఓపెన్ గా ఉంటుంది. క్వాల్కామ్ ఇండియా అధ్యక్షుడు రాజన్ వాగాడియా మాట్లాడుతూ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో మొబైల్ గేమింగ్ ఒకటి.
also read ఫేస్బుక్ డాటా లీక్ లో మార్క్ జుకర్బర్గ్ ఫోన్ నంబర్.. సిగ్నల్ యాప్ వాడుతున్నట్లు వెల్లడి.. ...
భారతదేశంలో 90 శాతం మంది గేమర్లు వారి మొబైల్లను గేమింగ్ కోసం ప్రైమరీ డివైజ్ గా ఉపయోగిస్తున్నారు. "మేము జియో వంటి బ్రాండ్తో జతకట్టాలని అనుకున్నాము, ఇది మా అవకాశాలని లోతుగా అర్థం చేసుకొని, మా నమ్మకంతో సరిపోతుంది" అని వాగాడియా అన్నారు. సింగిల్ ప్లేయర్స్ అలాగే టీం ప్లేయర్స్ ఇద్దరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు.
సోలో ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11న, 5 vs 5 టీమ్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 30న ముగియనున్నాయి. అలాగే టోర్నమెంట్ కోసం రిజిస్ట్రేషన్ అండ్ పార్టిసిపేషన్ ఫీజు ఉండదు.
"గేమర్స్ సాధికారత భాగస్వామ్య దృష్టితో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్, జియో గేమ్స్ గేమింగ్-ఆధారిత కంటెంట్ను నడిపించడమే కాకుండా, మరింత ప్రొఫెషనల్ స్థాయి అవకాశాల కోసం గేమర్లకు వారి నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఒక శిక్షణా స్థలాన్ని అందిస్తుంది. అని స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.