రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకపై ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్..
ఐఆర్సిటిసి వెబ్సైట్ పూర్తిగా కొత్తగా మారుతుంది, ఆర్టిఫిషియల్గానే ఇంటెలిజెన్స్ సాయంతో వెబ్సైట్ను పూర్తిగా అప్డేట్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అదనంగా, పోర్టల్ హోటల్ బుకింగ్తో పాటు భోజన బుకింగ్లతో అనుసంధానించింది.
రైల్వే ప్రయాణికులకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేయడానికి ఇండియన్ రైల్వే అధికారిక వెబ్సైట్ను కొత్తగా మార్చి ప్రయాణికుల ముందుకు తీసుకురాబోతుంది. వెబ్ పోర్టల్ www.irctc.co.in చివరిసారిగా 2018 లో అప్గ్రేడ్ చేసింది.
ఐఆర్సిటిసి వెబ్సైట్ పూర్తిగా కొత్తగా మారుతుంది, ఆర్టిఫిషియల్గానే ఇంటెలిజెన్స్ సాయంతో వెబ్సైట్ను పూర్తిగా అప్డేట్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అదనంగా, పోర్టల్ హోటల్ బుకింగ్తో పాటు భోజన బుకింగ్లతో అనుసంధానించింది.
కొత్త మార్పులతో ఐఆర్సిటిసి టికెట్ బుకింగ్ వెబ్సైట్ను ఆగస్టులో విడుదల చేయనున్నట్లు యాదవ్ పేర్కొన్నారు. "కొత్త పోర్టల్ ప్రారంభించినప్పుడు ప్రయాణీకులకు మెరుగైన అనుభవం ఉంటుంది" అని ఆయన అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయాణీకులకు బుకింగ్ అంచనా వేస్తుంది.
also read నాలుగు నెలల్లో 30వేల కోట్లు విత్డ్రా..
అందుబాటులో ఉన్న రైళ్లను సూచిస్తుంది" అని యాదవ్ చెప్పారు. వెబ్సైట్ను మరింతగా ప్రయాణీకులకు అనుకూలంగా మార్చడానికి రైళ్లకు సులభమైన ఫిల్టర్లు, అన్ని రైళ్లలో సీట్ల లభ్యత, ఛార్జీలు, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్ వంటి కొత్త ఫీచర్లు జోడించనుంది.
రైళ్ల ట్రాకింగ్ కోసం రైల్వేలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. రైళ్లు బయలుదేరే సమయాన్ని, ప్రయాణీకులకు రియల్ టైమ్ రైళ్ల కదలికను తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
కాంటాక్ట్లెస్ టికెట్ చెకింగ్ నిర్ధారించడానికి క్యూఆర్ కోడ్ టికెట్లను ఉత్పత్తి చేస్తామని జూలై 23న రైల్వే తెలిపింది. ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లలో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులు ఈ సదుపాయాన్ని పొందగలరు. ఫలితంగా ప్రయాణీకులు, రైల్వే ఉద్యోగుల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు.
టికెట్ కొనుగోలు చేసే ప్రయాణీకులకు క్యూఆర్ కోడ్ ఉన్న ఎస్ఎంఎస్ అందుతుంది, టికెట్ తనిఖీ చేసే అధికారులు హ్యాండ్హెల్డ్ పరికరాలను ఉపయోగించి స్కాన్ చేయవచ్చు. ఈ వారం ప్రారంభంలో స్టేషన్లలో కాంటాక్ట్లెస్ టికెట్ చెకింగ్ నిర్వహించడానికి సిబ్బంది కోసం ‘చెక్ఇన్ మాస్టర్’ అనే యాప్ రైల్వే ప్రారంభించింది. యాప్ ఓసిఆర్, క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా పిఆర్ఎస్, యూటిఎస్ టిక్కెట్లను చెక్ చేయవచ్చు.