IT Notice: ఆదాయ పన్ను శాఖ ఈ మధ్య కాలంలో తమ నిబంధనలను కఠినం చేసింది. ఈ నేపథ్యంలో మీరు చేసే కొన్ని పొరపాట్లు ఆదాయ పన్ను శాఖ నోటీసు పొందేలా చేస్తుంటాయి. అయితే ఈ 5 పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహిస్తే మీకు ఐటీ నోటీసు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
చాలా మందికి ఆదాయ పన్ను లేదా ఐటీ నోటీసు (IT Notice) అనగానే కంగారు పుడుతుంది. ఐటీ నోటీసును అందుకోగానే రెయిడ్స్ జరిగిపోతాయేమో అనేంత గుబులు వస్తుంది. అయితే అంతగా కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. నిజానికి మీరు చేసే నగదు లావాదేవీల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఐటీ నోటీసుల నుంచి తప్పించుకోవచ్చు.
నిజానికి నగదు లావాదేవీల విషయంలో ఆదాయపు పన్ను శాఖ (Income tax department) చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలను మార్చింది. వీటిలో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌస్లు, బ్రోకర్ ప్లాట్ఫారమ్లు వంటి అనేక ప్లాట్ఫారమ్లు సాధారణ ప్రజల నగదు లావాదేవీలకు సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నగదు లావాదేవీలకు పరిమితి విధించింది. ఈ నిబంధనలను కొంచెం కూడా పాటించకపోతే, ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు.
ఇది కాకుండా, ఎవరైనా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, నగదు ఉపయోగించి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పెట్టుబడి పెట్టినట్లయితే, బ్రోకర్ తన బ్యాలెన్స్ షీట్లో దాన్ని నగదుగానే నివేదిస్తాడు. అలాంటి సందర్భాల్లో కూడా నగదు లావాదేవీగానే పరిగణిస్తారు. ఐటీ శాఖ నోటీసు ఇవ్వగలిగే అవకాశం ఉన్న 5 లావాదేవీల తెలుసుకుందాం. ఈ లావాదేవీల కారణంగా మీరు ఆదాయపు పన్ను నోటీసును పొందవచ్చు.
బ్యాంకు ఖాతాలో డబ్బు జమ
ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతా లేదా ఒకటి కంటే ఎక్కువ ఖాతాల నుండి రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ ఆ డబ్బు ఆదాయ మూలాన్ని ప్రశ్నించవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు ఏదైనా బ్యాంకులో పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేస్తే, అది బ్యాంకు లేదా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలని CBDT ఈ నిబంధనను రూపొందించింది. ఈ నియమం ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు
క్రెడిట్ కార్డులు ప్రజలు చెల్లించడాన్ని చాలా సులభతరం చేశాయి. అయితే, వినియోగదారులు తమ కార్డు బిల్లులను చెల్లించేటప్పుడు రూ.1 లక్ష పరిమితిని మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నగదు పరిమితి దాటితే, ఐటీ శాఖ మీకు నోటీసు ఇవ్వవచ్చు.
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్
బ్యాంక్ ఎఫ్డీలు రూ. 10 లక్షల వరకు నగదును డిపాజిట్ చేయడానికి అనుమతించబడతాయి. మీరు రూ. 10 లక్షల కంటే ఎక్కువ FD చేస్తే, మీరు నోటీసు పొందవచ్చు.
స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలు
తమ పేరు మీద ఆస్తి పొందుతున్నప్పుడు, వ్యక్తులు రూ.30 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయడం సరికాదని తెలుసుకోవాలి. మీరు రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఆస్తి లావాదేవీని నగదు రూపంలో చేస్తే, అది ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణలోకి వెళ్తారు. అప్పడు ఇంత భారీ లావాదేవీని నగదు రూపంలో చేయడానికి మీకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది.
మ్యూచువల్ ఫండ్/స్టాక్ మార్కెట్
ఇటీవలి కాలంలో, భారతదేశంలో డీమ్యాట్ ఖాతాదారుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు నగదు పెట్టుబడి పరిమితి రూ.10 లక్షలకు మించకూడదని తెలుసుకోవాలి. ఎవరైనా పరిమితికి మించి వెళితే, అది ఆదాయపు పన్ను శాఖ దృష్టిని వెళ్లవచ్చు. కాబట్టి, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు లేదా డిబెంచర్లలో సంవత్సరానికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లించవద్దు.