బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాల కారణంగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం (మార్చి 22, 2022) బంగారం, వెండి ధరలు పెరిగాయి.  

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధ కారణంగా ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకుంది. 10 గ్రాముల పసిడి ధర రూ. 53 వేలకు దూసుకెళ్లింది. అయితే గతవారం రోజులుగా బంగారం ధ‌ర‌లు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. శనివారం బంగారం ధర స్వల్పంగా పెరగగా.. ఆదివారం కాస్త తగ్గింది. ఇక సోమవారం పసిడి ధరలు నిలకడగా ఉండగా.. మంగ‌ళ‌వారం (మార్చి 22, 2022) మరోసారి పెరిగాయి.

మంగ‌ళ‌వారం ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 100 పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.68,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.300 పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,700గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,700గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,930గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,290 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400.. 24 క్యారెట్ల ధర రూ.51,700గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,700గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాలైన‌ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,400 ఉండ‌గా.. 24 క్యారెట్ల ధర రూ.51,700గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,700 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా, ముంబైలో రూ.68,300 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, కోల్‌కతాలో రూ.68,300గా ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,600గా ఉంది. కేరళలో రూ.72,600 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.72,600 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొనసాగుతోంది.